AP Council: ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి
ఏపీ కౌన్సిల్ జరుగుతున్న తీరుపై విపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది.రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంతో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు మా దగ్గర ఉన్నాయి. కొన్ని రసాయనాలు సైనేడ్ గా మారొచ్చనే అధ్యయనాలు ఉన్నాయి. ఇవన్నీ బయటకొస్తాయనే మమ్మల్ని దూషించి చర్చ నుంచి పారిపోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించమంటే స్పీకర్ మార్షల్స్ ని రమ్మంటున్నారు. మంత్రులు బొత్స, కొడాలినాని తరహాలో మా సభ్యులు ఎవ్వరూ ప్రవర్తించట్లేదు. కౌన్సిల్ ఛైర్మన్ గా ఉన్న షరీఫ్ ను బొత్స కులం పేరుతో దూషిస్తే, కొడాలినాని ఛైర్మన్ టేబుల్ ఎక్కలేదా..? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ నారా లోకేష్.
శాసన మండలిలో కోరం లేకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్సీ ఫరూఖ్. ఛైర్మన్ వచ్చి మంత్రులు, సభ్యుల కోసం వేచి చూసే కొత్త సంప్రదాయం చూస్తున్నాం. ఇవాళ్టి పరిణామాలకు చింతిస్తున్నాం, ముఖ్యమంత్రి, ప్రభుత్వం సభకు క్షమాపణ చెప్పాలి.
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ఓ ప్రజాసమస్యపై చర్చ కోసం ఏనాడూ ప్రతిపక్షం ఇన్ని రోజులు వేచి చూడలేదు. కమీషన్ కోసమే జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మద్యం ఆదాయం రూ.16వేల కోట్లకు పెంచుకోవటమా..? మద్యం భవిష్యత్తు ఆదాయంపై అప్పు తెచ్చిన వారు మద్య నిషేధం ఎలా అమలు చేస్తారు..? అని ప్రశ్నించారు చిక్కాల రామచంద్రరావు. సీఎం నియోజకవర్గం పులివెందులలో నాటు సారా కాస్తున్నారు. ఇక జంగారెడ్డి గూడెంలో సారా కాయరు అని సీఎం ఎలా చెప్తారు..? సారాపై చర్చకు ప్రభుత్వం భయపడుతుంది.
సభ చర్చకు అనుమతిస్తే సీఎంకు ఎంత ఆదాయం నెలకు వస్తుంది మద్యంపై అనేది నిరూపిస్తాం. బాబాయ్ హత్యను కూడా సహజ మరణమన్న వైసీపీకి.. జంగారెడ్డి గూడెం మరణాలు కూడా సహజ మరణాలుగానే చెబుతున్నారు అన్నారు ఎమ్మెల్సీ బీటెక్ రవి. డిప్యూటీ సీఎం వారాయణ స్వామిపై మండలి ఛైర్మనుకు ప్రివిలేజ్ నోటీసిచ్చిన టీడీపీ ఎమ్మెల్సీలు. మండలి నియావళి రూల్ 173 ప్రకారం ఛైర్మనుకు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ని అసెంబ్లీలో నారాయణ స్వామి దూషించారంటూ టీడీపీ ఎమ్మెల్సీల అభ్యంతరం తెలిపారు. రూల్ 291(ii) నిబంధన పాటించలేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు.
తాజావార్తలు
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
-
Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!