Kondru Murali: వైసీపీకి 175 కాదు కదా 17 సీట్లు కూడా రావు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. ఓట్లు, సీట్ల గురించి సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి.. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే.. ఈ సారి ఎక్కువగా వస్తాయని.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 తామే గెలుస్తామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నమాట.. అయితే.. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొండ్రు మురళి.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు న ఆయుడు యూనివర్శల్ నాయకుడు… కానీ, వైఎస్ జగన్ గల్లీనాయకుడు అంటూ వ్యాఖ్యానించారు.. మద్యం అమ్మకాల్లోనూ అవినీతి జరుగుతుందని ఆరోపించిన ఆయన.. సొంత బ్రాండ్లతో రోజుకి రూ.250 కోట్లు నువ్వే దోచుకు౦టున్నావు అంటూ.. సీఎం వైఎస్ జగన్పై సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: Business Headlines 19-07-22: పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన రిటైల్ సేల్స్..
Also Read
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. 'పితృసమాన నేతను కోల్పోయాం'
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
వైన్, మైను, ల్యాండ్ అన్నీ దోచుకు౦టున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించారు కొండ్రు మురళి.. మీలాంటి గల్లీనాయకుడు వెనక మేము రాము అని స్పష్టం చేసిన ఆయన.. నీ వెనకాల ఉన్న నాయకులు గడ్డితినడానికి ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు.. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతపై దాడి వ్యవహారం కలకలం సృష్టించింది.. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. రొంపిచర్ల మండల అధ్యక్షుడు బాల కోటిరెడ్డిపై వైసీపీ ఎంపీపీ, అతని అనుచరులు ఒక పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించిన ఆయన.. సీఎం జగన్ రాష్ట్రం మొత్తం పులివెందుల లాగా అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసులు వైసీపీ నేతలకు సొంత చుట్టాలుగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఎన్ని అరాచకాలు చేసైనా సరే మళ్లీ గెలవాలని చూస్తున్నారు అని.. వైసీపీ ప్రభుత్వం ప్రజలలో ఆదరణ కోల్పోయి ప్రతిపక్షాలపై హత్య రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!