Business Headlines 19-07-22: పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన రిటైల్ సేల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Headlines 19-07-22: పీఎస్యూల్లో పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఫారన్ ఫండ్ మేనేజర్లకు మన ప్రభుత్వ రంగ సంస్థలపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటికే ఇండియన్ ఈక్విటీల్లోని 2 లక్షల 27 వేల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. అయిప్పటికీ అదే సమయంలో 30 ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగటం విశేషం. మొత్తం 50 లిస్టెడ్ పీఎస్యూల్లో 30 పీఎస్యూలు ఎఫ్పీఐల్లో వృద్ధి సాధించటం చెప్పుకోదగ్గ విషయం.
Also Read
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
తొలిసారి 80 మార్క్ దాటిన రూపాయి
రూపాయి మారకం విలువ తొలిసారి 80 మార్క్ దాటింది. అమెరికా డాలర్తో పోల్చితే ఏడాది వ్యవధిలో సుమారు 7 శాతం పతనమైంది. నిన్న సోమవారం సాయంత్రం స్టాక్ మార్కెట్లు ముగిసేటప్పటికి 79 పాయింట్ తొమ్మిదీ ఏడు పలికిన దేశీయ కరెన్సీ మారకం విలువ ఇవాళ మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన మొదట్లో 80 పాయింట్ ఒకటీ ఏడుకి క్షీణించింది.
ఇండస్ ఇండ్ 20 వేల కోట్ల ఫండ్ రైజింగ్
ఇండస్ ఇండ్ బ్యాంక్ 20 వేల కోట్ల రూపాయల వరకు ఫండ్ రైజింగ్ చేయనుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతించినట్లు సోమవారం వెల్లడించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన ఈక్విటెన్స్ని జారీ చేయటం ద్వారా ఈ నిధులను సేకరించనుంది.
read more: Rupee hits 80 mark: రూ’పాయే’.. డాలర్తో రికార్డు కనిష్టానికి..!
30 శాతం తగ్గిన రష్యా చమురు దిగుమతి
రష్యా నుంచి ఇండియా, చైనాలకు క్రూడాయిల్ దిగుమతి దాదాపు 30 శాతం తగ్గింది. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమయ్యాక ఆసియా దేశాలు చమురు కోసం రష్యా పైన ఆధారపడటాన్ని మానుకున్నాయి. ఒకానొక దశలో ఇండియా చుక్క చమురును కూడా తీసుకోని రోజులున్నాయి. అయితే యుద్ధ వాతావరణంలో కాస్త సడలింపు రావటంతో మన దేశం గత నెలలో ఓ రోజు రష్యా నుంచి పది లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ని దిగుమతి చేసుకుంది.
జూన్లో తగ్గిన రిటైల్ అమ్మకాలు
ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలలతో పోల్చితే మూడో నెలలో రిటైల్ సేల్స్ వృద్ధి రేటు మందగించింది. 2019 జూన్ కన్నా ఈ ఏడాది జూన్లో చిల్లర అమ్మకాలు 13 శాతం పెరిగినప్పటికీ రానున్న పండగ సీజన్లో తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. నిత్యవసరాల ధరలు పెరగటంతో వినియోగదారులు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రభావం వచ్చే నెలల్లోనూ కొనసాగొచ్చని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
తాజావార్తలు
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
-
US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!