Business Headlines 19-07-22: పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన రిటైల్ సేల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Headlines 19-07-22: పీఎస్యూల్లో పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఫారన్ ఫండ్ మేనేజర్లకు మన ప్రభుత్వ రంగ సంస్థలపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటికే ఇండియన్ ఈక్విటీల్లోని 2 లక్షల 27 వేల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. అయిప్పటికీ అదే సమయంలో 30 ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగటం విశేషం. మొత్తం 50 లిస్టెడ్ పీఎస్యూల్లో 30 పీఎస్యూలు ఎఫ్పీఐల్లో వృద్ధి సాధించటం చెప్పుకోదగ్గ విషయం.
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
తొలిసారి 80 మార్క్ దాటిన రూపాయి
రూపాయి మారకం విలువ తొలిసారి 80 మార్క్ దాటింది. అమెరికా డాలర్తో పోల్చితే ఏడాది వ్యవధిలో సుమారు 7 శాతం పతనమైంది. నిన్న సోమవారం సాయంత్రం స్టాక్ మార్కెట్లు ముగిసేటప్పటికి 79 పాయింట్ తొమ్మిదీ ఏడు పలికిన దేశీయ కరెన్సీ మారకం విలువ ఇవాళ మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన మొదట్లో 80 పాయింట్ ఒకటీ ఏడుకి క్షీణించింది.
ఇండస్ ఇండ్ 20 వేల కోట్ల ఫండ్ రైజింగ్
ఇండస్ ఇండ్ బ్యాంక్ 20 వేల కోట్ల రూపాయల వరకు ఫండ్ రైజింగ్ చేయనుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతించినట్లు సోమవారం వెల్లడించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన ఈక్విటెన్స్ని జారీ చేయటం ద్వారా ఈ నిధులను సేకరించనుంది.
read more: Rupee hits 80 mark: రూ’పాయే’.. డాలర్తో రికార్డు కనిష్టానికి..!
30 శాతం తగ్గిన రష్యా చమురు దిగుమతి
రష్యా నుంచి ఇండియా, చైనాలకు క్రూడాయిల్ దిగుమతి దాదాపు 30 శాతం తగ్గింది. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమయ్యాక ఆసియా దేశాలు చమురు కోసం రష్యా పైన ఆధారపడటాన్ని మానుకున్నాయి. ఒకానొక దశలో ఇండియా చుక్క చమురును కూడా తీసుకోని రోజులున్నాయి. అయితే యుద్ధ వాతావరణంలో కాస్త సడలింపు రావటంతో మన దేశం గత నెలలో ఓ రోజు రష్యా నుంచి పది లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ని దిగుమతి చేసుకుంది.
జూన్లో తగ్గిన రిటైల్ అమ్మకాలు
ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలలతో పోల్చితే మూడో నెలలో రిటైల్ సేల్స్ వృద్ధి రేటు మందగించింది. 2019 జూన్ కన్నా ఈ ఏడాది జూన్లో చిల్లర అమ్మకాలు 13 శాతం పెరిగినప్పటికీ రానున్న పండగ సీజన్లో తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. నిత్యవసరాల ధరలు పెరగటంతో వినియోగదారులు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రభావం వచ్చే నెలల్లోనూ కొనసాగొచ్చని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
తాజావార్తలు
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?