ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి పేదవాడి కడుపు దని విమర్శించారు. ఉపాధి హామీ నిధులు వ్యయంపై విమర్శించారు మాజీ మంత్రి అయ్యన్న. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్లో గోతులు పూడ్చడానికి ఉపాధి హామీ నిధులను వినియోగించారని మండిపడ్డారు.
ఈ విధంగా రెండు వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం శుభపరిణామం అన్నారు. కేంద్ర వాటా నిధులను అధికారుల నుంచి వసూలు చేయాలంటూ ఆదేశించడం హర్షణీయం అన్నారు అయ్యన్న. దీనిపై వెనకడుగు వేయకుండా కేంద్రం చర్యలు తీసుకునేలా రాష్ట్ర బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.