Bonda Uma: కందుకూరు, గుంటూరు ఘటనలపై సీబీఐ ఎంక్వయిరీ వేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bonda Uma: పోలీసుల వైఫల్యమే కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటకు కారణమని.. ఆ రెండు ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు.. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను పక్కదారి మళ్లించేందుకు ప్రతిపక్షపార్టీ నేతలపై వేధింపుల తీవ్రత పెరుగుతోందని.. చంద్రబాబు సభలు, సమావేశాలకు వచ్చే జనాలను చూసి సీఎం వైఎస్ జగన్ వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు.. జగన్ ఫెయిల్యూర్ సీఎం.. చంద్రబాబు సభలకు తండోపతండాలుగా జనం వస్తున్నారంటే జగన్ పనైపోయినట్టే అని జోస్యం చెప్పారు.. రాష్ట్రంలో జీవో 1 ద్వారా అప్రకటిత ఎమర్జెన్సీ జగన్ అమలు చేస్తున్నారు.. 1981లో బ్రిటీష్ పాలనకు బూజులు దులిపి.. నేడు ప్రతిపక్షాల గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయకుండా అరాచక సృష్టించారు. పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Karnataka: హంగ్ దిశగా కర్ణాటక.. ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడి
Also Read
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు డిసైడ్ చేస్తారట? అని ఎద్దేవా చేశారు బోండా ఉమ.. ఆనాడే జాతిపిత గాంధీ ప్రజాస్వామ్యాన్ని, విలువలను తుంగలో తొక్కే బ్రిటిష్ చట్టాలను వ్యతిరేకించారు. జగన్ ఫెయిల్యూర్ సీఎం అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తాలిబన్ చట్టాలను సైతం జగన్ అమలు చేసే అవకాశం ఉందన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకునేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేశాం. చరిత్రలో నియంతలు మనుగడ సాగించలేరని పేర్కొన్నారు. ఇవాళ జగన్ నియంతలా వ్యవహరిస్తున్నాడు.. టీడీపీ కేంద్ర కార్యాలయం ముందు వందల మంది పోలీసులను పెట్టారు.. మా పార్టీ నేతల ఇళ్ల ముందు పోలీసులు.. ఏంటీ ఈ అరాచకం..? కుప్పంలో మాజీ సీఎం ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేయడం తప్పా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు ఒక రోజు ఉంటుందని తెలుసుకో జగన్ అంటూ హెచ్చరించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని అధికారులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.. జగన్ రెడ్డి చెప్పినదానికి తల ఊపితే అధికారులు ఇబ్బందులకు గురవుతారు.. అక్రమ అరెస్టులకు మేం భయపడబోమని ప్రకటించారు.
తాజావార్తలు
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!