Vangalapudi Anitha: రేప్ చేసినా రేపు రండి అనే స్థితిలో ఏపీ పోలీసు శాఖ..! అనిత ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేప్ చేసినా రేపు రండి అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కనిపిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత.. ఎంపీ గోరంట్ల మాధవ్ ను వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా..? అంటూ ఫైర్ అయ్యారు.. రాజకీయ కుట్ర అని హోం మంత్రి ఎలా చెబుతారు..? వెకిలి వేషాలేస్తోన్న ఎంపీపై చర్యలు తీసుకోకుండా ఎంపీని వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా..? హోం మంత్రిగా ఎలా పని చేయాలో తెలియకుంటే ఇంట్లో కూర్చొవాలి.,. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత హోం మంత్రి బయటకొచ్చి కుట్ర అని మాట్లాడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అందుబాటులో ఎవ్వరూ లేరు.. పబ్లిక్ హాలిడే కాబట్టి.. పోలీసు ఉన్నతాధికారులు సెలవులో ఉన్నారట.. 24 గంటలు పని చేయాల్సిన పోలీసు శాఖ సెలవు తీసుకుందని ఎద్దేవా చేశారు.
Read Also: Amalapuram Incident: అమలాపురం అల్లర్లకు అసలు కారకులు సీఎం, డీజీపీకి తెలుసు..!
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
అంబటి రాంబాబు, అవంతి లాంటి వాళ్లపై చర్యలు తీసుకుని ఉంటే మాధవ్ న్యూడ్ ఎపిసోడ్పై ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చేది కాదన్నారు అనిత.. తప్పు చేసిన మాధవ్ ను ఆ పార్టీకి చెంది సహచర ఎంపీలే వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.. ఎంపీ మాధవ్ పొరంబోకు వేషాలు వేస్తున్నారని మండిపడ్డ ఆమె.. మహిళా జేఏసీ తరపున మాధవ్ న్యూడ్ వీడియో విషయమై ఎంపీలకు.. జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు అనిత.. అయితే, టీడీపీ విమర్శలపై ఘాటుగా స్పందించారు హోంమంత్రి తానేటి వనిత..ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళా నేతలు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో గమనించుకోవాలని హితవు పలికారు. ఆ మహిళానేతలు వాడే పదజాలం రాష్ట్రంలోని మహిళలందరూ సిగ్గుపడేలా ఉందని తానేటి వనిత విమర్శించారు. ఈ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్న ఆమె.. సీఎం జగన్ మూడేళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉండడం ఓర్వలేక ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలకు దిగుతున్నారని ఆరోపించారు. మాధవ్ అంశంలో వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అది నిజమని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!