Chandra Babu: వివేకా హత్య కేసులో దొంగలను పట్టుకున్న సీబీఐది తప్పా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి: టీడీపీ కార్యాలయంలో రెండో రోజు సర్పంచుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సర్పంచ్లకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా పంచాయతీల్లో తీర్మానం చేయాలని వారికి హితవు పలికారు. టీడీపీ సర్పంచ్లు ఉన్న ప్రతి చోట చెత్త పన్నుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలని.. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు.
కాగా వివేకా హత్య కేసు విషయంలో తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయ్ను చంపి టీడీపీ మీద జగన్ విమర్శలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కేసులో దొంగలను పట్టుకున్న సీబీఐది తప్పంటారా అని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని వైఎస్ వివేకా అన్నందుకు కక్ష కట్టారన్నారు. పరిటాల రవి హంతకులను ఒక్కొక్కర్ని చంపేశారని.. రాష్ట్ర ముఖ్యమంత్రే నేరాలు, ఘోరాలు చేస్తూ హత్య రాజకీయాలు చేస్తే ఎలా అంటూ నిలదీశారు. సర్పంచ్లను సీఎం జగన్ ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచ్లను కాదని ఒక్క పని చేయడానికైనా వీల్లేదన్నారు. గ్రామాల్లో సర్పంచులే సుప్రీం అన్నారు. టీడీపీ సర్పంచులు పట్టుదలతో వ్యవహరిస్తే వైసీపీ సర్పంచుల నుంచే మద్దతు లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
గ్రామాల్లో టీడీపీ హయాంలో కట్టించిన భవనాలకు రంగులేసుకోవడంతోనే వైసీపీ పాలన సరిపోతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రూ. 7 వేల కోట్లకు పైగా నిధులు ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి వచ్చాయన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల ఖాతాలకు చేరాల్సిన నిధులను ప్రభుత్వం తీసేసుకుందని మండిపడ్డారు. గ్రామాల్లో పేదలకిచ్చిన ఇంటి జాగా నివాస యోగ్యంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల సేకరణలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. పేదలకిచ్చిన భూములన్నీ లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయని.. ఓ పంచాయతీ నుంచి మరో పంచాయతీకి రోడ్లేయలేని సీఎం జగన్.. విమానాలు తెస్తారట అంటూ సెటైర్లు వేశారు. విమానాలు వస్తే రోడ్లతో పనే ఉండదు.. రోడ్ల మీద వ్యవసాయం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టి.. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు.. విపరీతంగా అప్పులు తెచ్చారు.. కానీ జెన్కో ఉద్యోగులకు జీతాలివ్వలేకపోయారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఒక్క రోజైనా ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇచ్చామా అని అడిగారు. సీఎం జగన్ హోల్ సేలుగా దోచుకుంటుంటే.. మిగిలిన అధికార పార్టీ నేతలు చిల్లర దొపిడీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుకను హోల్ సేల్గా అమ్మేశారని.. గ్రామాలకు రావాల్సిన సెస్ రాకుండా చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!