Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన అల్లుడు మంజునాథ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లెలోని ఓ అపార్ట్మెంట్లో ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఆయన వయస్సు 36 సంవత్సరాలు.. అయితే, దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.
Read Also: Monkeypox Test Kit: మొట్టమొదటి స్వదేశీ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ విడుదల
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
అయితే, మంజునాథరెడ్డి ఆత్మహత్యపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన రెడ్డి అండ్ రెడ్డి అనే కంపెనీని నిర్వహిస్తున్నారని, అప్పుడప్పుడు కుంచనపల్లిలోని నివాసానికి వస్తుంటారని వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు.. లేదంటే కుటుంబ కలహాల కారణంగా ఆయన బలవన్మరణానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది.. ఇక, మంజునాథరెడ్డి ఆత్మహత్యపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో మంజునాథ రెడ్డి మృతదేహం ఉండగా.. ఆస్పత్రికి చేరుకున్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి… ఎమ్మెల్యేతో పాటు మంజునాథ రెడ్డి తల్లి దండ్రులు, భార్య ఆస్పత్రిలో ఉన్నారు.. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం