Students: విద్యార్థుల అవస్థలు.. గుర్రం ఎక్కితేనే స్కూల్కు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students: ఈ మధ్య రిలీజైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో మన్యంలో ఉండే అడవి బిడ్డల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.. ఆ సినిమా ఎంతటి విషయం సాధించింది అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికే అలా ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. కనీస అవరాలకు దూరంగా బతుకు వెళ్లదీస్తున్నాయి.. ఇప్పటి ప్రజలు కష్టాలు వెళ్లదీయడమేకాదు.. నేటి బాలలు.. రేపటి పౌరులకు కూడా ఇవే ఇబ్బందులు.. మంచి భవిష్యత్ కోసం స్కూల్కు వెళ్లి.. చదువుకోవడం వారికి గగనంగా మారిపోయింది.. రోడ్లు లేక, కనీసం నడిచే తోవలు కూడా సరిగా లేక.. గుర్రాలను ఆశ్రయిస్తున్నారు చిన్నారులు.. అయితే, ఆ విద్యార్థుల కష్టాలు ఓ సామాజిక కార్యకర్త దృష్టిలో పడ్డాయి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు ఆ చిన్నారుల కష్టాలు వైరల్గా మారిపోయాయి..
Read Also: Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, గోంతెత్తకుండా ఉండను..!
Also Read
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటే.. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా సబ్ ప్లాన్ ఏరియాలో ఈ ఘటన వెలుగు చూసింది.. ఆ విద్యార్థుల కష్టాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రావికమతం మండలం గిరిశిఖర గ్రామమైన నేరేడు బందకు చెందిన విద్యార్థులు గుర్రాలపై పాఠశాలకు వెళ్తున్నారు. 15 మంది విద్యార్థులు పక్క గ్రామంలో పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు.. వారి చిన్న పాదాలతో కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు.. దీంతో గుర్రాలపై జెడ్. జోగుంపేట పాఠశాలకు వెళ్తున్నారు విద్యార్థులు.. ఆ విద్యార్థులు గుర్రాలపై వెళ్లేందుకు స్థానికులు సాయం చేస్తున్నారు.. అయితే, ఒక్కో గుర్రంపై ముగ్గురు, నలుగురు, ఐదుగురు విద్యార్థులు.. ప్రమాదకరంగా వెళ్లాల్సిన పరిస్థితి.. తమకు రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల గ్రామానికీ వెళ్లిన ఒక సామాజిక కార్యకర్త విద్యార్థుల కష్టాలను తన కెమెరాలో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. ఈ చిన్నారుల బాధలను పట్టించుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు..
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?