తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాలు… అలాగే ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా శ్రీశైలంలో వరద నీరు క్రమంగా పెరిగి జలాశయం నిండు కుండల మారింది. దాంతో శ్రీశైలం గేట్లు ఎత్తారు. జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 2,04,279 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 2,61,276 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 214.3637 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంతో పాటుగా కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే గత నెలలోనే ఈ జలాశయం పూర్తిగా నిండగా.. అధికారులు దిగువకు నీటిని విడుదల చేసారు.