Ram Mohan Naidu: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు, మోడీ వల్లే సాధ్యం..
- శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం
- ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు రావడం ఆనందంగా ఉంది- రామ్మోహన్ నాయుడు
- గత పాలనలో ఇచ్ఛాపురంలో తిరగాలంటే స్థానికులు భయపడే వారు- రామ్మోహన్ నాయుడు
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు.. మోడీ వల్లనే సాధ్యం అవుతుంది- రామ్మోహన్ నాయుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఎమెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. గత పాలనలో ఇచ్ఛాపురంలో తిరగాలంటే భయం భయంగా స్థానికులు ఉండేవారు.. ఇప్పుడు అందరూ చిరునవ్వుతో ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు, మోడీ వల్లనే సాధ్యం అవుతుందని అన్నారు. అధికారంలో రాగానే పింఛన్లు మూడు నెలలు బకాయి ఒకేసారి ఇచ్చి హామీ నెరవేర్చుకున్నాం.. సూపర్ సిక్స్లో ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్దాన సమస్యలను త్వరలో పరిష్కరిస్తుంది.. శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు.. దానిపై కార్యాచరణ రూపొందిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Read Also: RBI Repo Rate: రెపో రేటును 25 పాయింట్లు తగ్గించనున్న ఆర్బీఐ?
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. 2019లో దుర్మార్గుల పాలన 5 సంవత్సరాలు జరిగింది.. సచివాలయం కూడా తనఖా పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. ప్రజల కోసం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంటే కొంతమంది దీన్ని వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాలేదు.. ఇప్పుడిప్పుడే రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం.. ఇచ్చిన ప్రతి హామీని తమ నాయకుడు చంద్రబాబు నెరవేరుస్తారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Also: Vangalapudi Anitha: అధికారుల్లో ఇంకా పాత వాసన ఉంది.. హోంమంత్రి సీరియస్
తాజావార్తలు
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
-
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
-
UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
-
IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
-
kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..