Mega PTM 3.0: మెగా PTM 3.0.. విద్యార్థులు, పేరెంట్స్కు సీఎం చంద్రబాబు కుశల ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega PTM 3.0: తమ పిల్లలు ఎలా చదువుతున్నారో నరుగా స్కూల్కు వెళ్లి తెలుసుకునే విధంగా.. మెగా PTM కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే రెండు పీటీఎంలు విజయవంతం కాగా.. ఈ రోజు మూడో పీటీఎం నిర్వహిస్తున్నారు.. శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో పేరెంట్, టీచర్ మీటింగ్లో పాల్గొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. విద్యార్థులు.. తల్లి, తండ్రితో సీఎం ముఖాముఖి నిర్వహించారు.. పిల్లలు ఏమి చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.. మీకు తల్లికి వందనం వచ్చిందా అని అడిగారు… 9 మంది పిల్లలకు 90 వేలు వచ్చిందా అని అడిగగా.. వచ్చిందని సమాధానం ఇచ్చారు.. అయితే, రాబోయే రోజుల్లో పిల్లలు మీకు ఆస్తి అని తెలిపారు చంద్రబాబు..
ఇక, ప్రోగ్రెస్ కార్డును చూసిన సీఎం.. అబ్సెంట్ ను, సబ్జెక్టుల వారీగా మార్కులు చదివారు.. మూడు సబ్జెక్టులలో మార్కులు తగ్గాయి ఎందుకు అని ప్రశ్నించారు.. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయిగా అంటూ తల్లిదండ్రులను అడిగారు.. తండ్రిగా నీవు ప్రతీ సారి మీటింగ్ లకు వచ్చరా…? పిల్లలు ఎలా చదువుతున్నారో ఉపాధ్యాయులు చెబుతున్నారా లేదా అని అడిగారు.. పిల్లలను అభినందించి క్లాస్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు.. గణితం బోధిస్తున్న టీచర్ తో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మాట్లాడారు.. తరగతి గదిలో వారికి ఏ విధంగా బోధిస్తున్నారో విద్యార్థినితో లెక్కలపై అడిగి తెలుసుకున్నారు..
Also Read
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
మోడల్ స్కూల్ లో తల్లిదండ్రులతో.. నారా లోకేష్ తో కలిసి ఫోటో దిగారు సీఎం చంద్రబాబు.. రిజిష్టర్ లో తల్లిదండ్రులకు ప్రశ్నలు అడిగి వాటిని నోట్ చేసుకొని సంతకం చేశారు.. మరో తరగతిలోకి వెళ్లి విద్యార్థులు, పిల్లలతో కలసి కూర్చొన్నారు.. తల్లిదండ్రులతో కలసి వచ్చిన పిల్లలు ఎవరు అంటూ చేతులెత్తమన్నారు.. తండ్రుల కన్నా తల్లులే ఎక్కువగా వచ్చిన విద్యార్ధులను అభినందించారు సీఎం.. విద్య ఎలా ఉంది…. బాగా చదువుకుంటున్నారా లేదా.. అంటూ కుశల ప్రశ్నలు వేశారు.. విద్యార్ధినీ, విద్యార్ధులతో కరచాలన చేసి, మరో క్లాస్ కు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు.. క్లాస్ లో ఎంత మంది ఉన్నారు ఇందులో గర్ల్స్ ఎంతమంది? బాయ్స్ ఎంతమంది అని విద్యార్దినులనే అడిగారు. క్లాసులో చెబుతున్న సిలబస్ ను ఇతర్రా వివరాలను, కంప్యూటర్ లో ఎలా పిల్లలకు చదువుతు చెబుతున్నారో వివరాలను తెలిపారు మంత్రి లోకేష్.. కంప్యూటర్ ద్వారా పాఠాలు బోధించే విధానాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!