Mega PTM 3.0: మెగా PTM 3.0.. విద్యార్థులు, పేరెంట్స్కు సీఎం చంద్రబాబు కుశల ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega PTM 3.0: తమ పిల్లలు ఎలా చదువుతున్నారో నరుగా స్కూల్కు వెళ్లి తెలుసుకునే విధంగా.. మెగా PTM కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే రెండు పీటీఎంలు విజయవంతం కాగా.. ఈ రోజు మూడో పీటీఎం నిర్వహిస్తున్నారు.. శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో పేరెంట్, టీచర్ మీటింగ్లో పాల్గొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. విద్యార్థులు.. తల్లి, తండ్రితో సీఎం ముఖాముఖి నిర్వహించారు.. పిల్లలు ఏమి చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.. మీకు తల్లికి వందనం వచ్చిందా అని అడిగారు… 9 మంది పిల్లలకు 90 వేలు వచ్చిందా అని అడిగగా.. వచ్చిందని సమాధానం ఇచ్చారు.. అయితే, రాబోయే రోజుల్లో పిల్లలు మీకు ఆస్తి అని తెలిపారు చంద్రబాబు..
ఇక, ప్రోగ్రెస్ కార్డును చూసిన సీఎం.. అబ్సెంట్ ను, సబ్జెక్టుల వారీగా మార్కులు చదివారు.. మూడు సబ్జెక్టులలో మార్కులు తగ్గాయి ఎందుకు అని ప్రశ్నించారు.. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయిగా అంటూ తల్లిదండ్రులను అడిగారు.. తండ్రిగా నీవు ప్రతీ సారి మీటింగ్ లకు వచ్చరా…? పిల్లలు ఎలా చదువుతున్నారో ఉపాధ్యాయులు చెబుతున్నారా లేదా అని అడిగారు.. పిల్లలను అభినందించి క్లాస్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు.. గణితం బోధిస్తున్న టీచర్ తో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మాట్లాడారు.. తరగతి గదిలో వారికి ఏ విధంగా బోధిస్తున్నారో విద్యార్థినితో లెక్కలపై అడిగి తెలుసుకున్నారు..
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
మోడల్ స్కూల్ లో తల్లిదండ్రులతో.. నారా లోకేష్ తో కలిసి ఫోటో దిగారు సీఎం చంద్రబాబు.. రిజిష్టర్ లో తల్లిదండ్రులకు ప్రశ్నలు అడిగి వాటిని నోట్ చేసుకొని సంతకం చేశారు.. మరో తరగతిలోకి వెళ్లి విద్యార్థులు, పిల్లలతో కలసి కూర్చొన్నారు.. తల్లిదండ్రులతో కలసి వచ్చిన పిల్లలు ఎవరు అంటూ చేతులెత్తమన్నారు.. తండ్రుల కన్నా తల్లులే ఎక్కువగా వచ్చిన విద్యార్ధులను అభినందించారు సీఎం.. విద్య ఎలా ఉంది…. బాగా చదువుకుంటున్నారా లేదా.. అంటూ కుశల ప్రశ్నలు వేశారు.. విద్యార్ధినీ, విద్యార్ధులతో కరచాలన చేసి, మరో క్లాస్ కు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు.. క్లాస్ లో ఎంత మంది ఉన్నారు ఇందులో గర్ల్స్ ఎంతమంది? బాయ్స్ ఎంతమంది అని విద్యార్దినులనే అడిగారు. క్లాసులో చెబుతున్న సిలబస్ ను ఇతర్రా వివరాలను, కంప్యూటర్ లో ఎలా పిల్లలకు చదువుతు చెబుతున్నారో వివరాలను తెలిపారు మంత్రి లోకేష్.. కంప్యూటర్ ద్వారా పాఠాలు బోధించే విధానాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!