Mega PTM 3.0: మెగా PTM 3.0.. విద్యార్థులు, పేరెంట్స్కు సీఎం చంద్రబాబు కుశల ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega PTM 3.0: తమ పిల్లలు ఎలా చదువుతున్నారో నరుగా స్కూల్కు వెళ్లి తెలుసుకునే విధంగా.. మెగా PTM కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే రెండు పీటీఎంలు విజయవంతం కాగా.. ఈ రోజు మూడో పీటీఎం నిర్వహిస్తున్నారు.. శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో పేరెంట్, టీచర్ మీటింగ్లో పాల్గొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. విద్యార్థులు.. తల్లి, తండ్రితో సీఎం ముఖాముఖి నిర్వహించారు.. పిల్లలు ఏమి చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.. మీకు తల్లికి వందనం వచ్చిందా అని అడిగారు… 9 మంది పిల్లలకు 90 వేలు వచ్చిందా అని అడిగగా.. వచ్చిందని సమాధానం ఇచ్చారు.. అయితే, రాబోయే రోజుల్లో పిల్లలు మీకు ఆస్తి అని తెలిపారు చంద్రబాబు..
ఇక, ప్రోగ్రెస్ కార్డును చూసిన సీఎం.. అబ్సెంట్ ను, సబ్జెక్టుల వారీగా మార్కులు చదివారు.. మూడు సబ్జెక్టులలో మార్కులు తగ్గాయి ఎందుకు అని ప్రశ్నించారు.. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయిగా అంటూ తల్లిదండ్రులను అడిగారు.. తండ్రిగా నీవు ప్రతీ సారి మీటింగ్ లకు వచ్చరా…? పిల్లలు ఎలా చదువుతున్నారో ఉపాధ్యాయులు చెబుతున్నారా లేదా అని అడిగారు.. పిల్లలను అభినందించి క్లాస్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు.. గణితం బోధిస్తున్న టీచర్ తో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మాట్లాడారు.. తరగతి గదిలో వారికి ఏ విధంగా బోధిస్తున్నారో విద్యార్థినితో లెక్కలపై అడిగి తెలుసుకున్నారు..
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
మోడల్ స్కూల్ లో తల్లిదండ్రులతో.. నారా లోకేష్ తో కలిసి ఫోటో దిగారు సీఎం చంద్రబాబు.. రిజిష్టర్ లో తల్లిదండ్రులకు ప్రశ్నలు అడిగి వాటిని నోట్ చేసుకొని సంతకం చేశారు.. మరో తరగతిలోకి వెళ్లి విద్యార్థులు, పిల్లలతో కలసి కూర్చొన్నారు.. తల్లిదండ్రులతో కలసి వచ్చిన పిల్లలు ఎవరు అంటూ చేతులెత్తమన్నారు.. తండ్రుల కన్నా తల్లులే ఎక్కువగా వచ్చిన విద్యార్ధులను అభినందించారు సీఎం.. విద్య ఎలా ఉంది…. బాగా చదువుకుంటున్నారా లేదా.. అంటూ కుశల ప్రశ్నలు వేశారు.. విద్యార్ధినీ, విద్యార్ధులతో కరచాలన చేసి, మరో క్లాస్ కు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు.. క్లాస్ లో ఎంత మంది ఉన్నారు ఇందులో గర్ల్స్ ఎంతమంది? బాయ్స్ ఎంతమంది అని విద్యార్దినులనే అడిగారు. క్లాసులో చెబుతున్న సిలబస్ ను ఇతర్రా వివరాలను, కంప్యూటర్ లో ఎలా పిల్లలకు చదువుతు చెబుతున్నారో వివరాలను తెలిపారు మంత్రి లోకేష్.. కంప్యూటర్ ద్వారా పాఠాలు బోధించే విధానాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!