Seediri Appalaraju: రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు..
- ఏపీలో వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు..
- ప్రైవేట్ డైరీలను సొంత వ్యక్తులకు ఈ ప్రభుత్వం కట్టబెడుతుంది..
- అచ్చెన్నాయుడికి అతడి డిపార్ట్మెంట్ పై అవగాహన లేదు: సీదిరి అప్పలరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. సహకార డైరీలను మూత వేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తుంది.. అలాగే, చిత్తూరు డైరీ మూత పడటానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. మాక్స్ యాక్ట్ తో ప్రైవేటు డైరీలను సొంత వ్యక్తులకు కట్టబెట్టారు.. ఇంత జరుగుతున్నా మంత్రి అచ్చెన్నాయుడు స్పందించడం లేదు అని ఆయన మండిపడ్డారు. పశు సంవర్థక శాఖ మంత్రిని పశువు అని నేను మాట్లాడను.. ఆవులు అమ్మెయ్యాల అనే దానిపై ఒకసారి చర్చించండి అని పేర్కొన్నారు. కేబినెట్ లో కేసులు ఎవరిపై పెట్టలో అనే దానిపై చర్చిస్తారు తప్ప.. పది మంది రైతులకు మంచి చేద్దాం అనే దానిపై చర్చించడం లేదు అని సీదిరి అప్పలరాజు అన్నారు.
Read Also: SSMB-29: వీడియో లీక్.. రాజమౌళి గురి తప్పుతోందా..?
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
ఇక, సొంత కంపెనీ లాభాల కోసం మిల్క్ సొసైటీలను నాశనం చేస్తున్నారు అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. డైరీ ఫాం రైతులకు అన్యాయం చేయొద్దని పేర్కొన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి అని డిమాండ్ చేశారు. ప్రైవేట్ డైరీల అరాచకం నడుస్తుంది.. పాడి రైతులు, ఆక్వా రైతులు ఆందోళన చేస్తున్నారు.. అచ్చెన్నాయుడు డిపార్ట్మెంట్ కి తాళం వేసేయండి.. ఎందుకంటే, ఆయనకి దాని మీద అవగాహన లేదనిపిస్తుంది అన్నారు. అచ్చెన్నాయుడుకి నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల ధరలు తగ్గించాలని అచ్చెన్న చెప్పారేమో.. మార్కెట్ లో పాల పాకెట్ ధరలు పెరిగిపోతున్నాయి.. దీంతో దేశంలో అతి పెద్ద డైరీని చంద్రబాబు సంపాదించాలని అనుకుంటున్నారా? అని సీదిరి అప్పల రాజు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!