Seediri Appalaraju: రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు..
- ఏపీలో వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు..
- ప్రైవేట్ డైరీలను సొంత వ్యక్తులకు ఈ ప్రభుత్వం కట్టబెడుతుంది..
- అచ్చెన్నాయుడికి అతడి డిపార్ట్మెంట్ పై అవగాహన లేదు: సీదిరి అప్పలరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. సహకార డైరీలను మూత వేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తుంది.. అలాగే, చిత్తూరు డైరీ మూత పడటానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. మాక్స్ యాక్ట్ తో ప్రైవేటు డైరీలను సొంత వ్యక్తులకు కట్టబెట్టారు.. ఇంత జరుగుతున్నా మంత్రి అచ్చెన్నాయుడు స్పందించడం లేదు అని ఆయన మండిపడ్డారు. పశు సంవర్థక శాఖ మంత్రిని పశువు అని నేను మాట్లాడను.. ఆవులు అమ్మెయ్యాల అనే దానిపై ఒకసారి చర్చించండి అని పేర్కొన్నారు. కేబినెట్ లో కేసులు ఎవరిపై పెట్టలో అనే దానిపై చర్చిస్తారు తప్ప.. పది మంది రైతులకు మంచి చేద్దాం అనే దానిపై చర్చించడం లేదు అని సీదిరి అప్పలరాజు అన్నారు.
Read Also: SSMB-29: వీడియో లీక్.. రాజమౌళి గురి తప్పుతోందా..?
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
ఇక, సొంత కంపెనీ లాభాల కోసం మిల్క్ సొసైటీలను నాశనం చేస్తున్నారు అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. డైరీ ఫాం రైతులకు అన్యాయం చేయొద్దని పేర్కొన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి అని డిమాండ్ చేశారు. ప్రైవేట్ డైరీల అరాచకం నడుస్తుంది.. పాడి రైతులు, ఆక్వా రైతులు ఆందోళన చేస్తున్నారు.. అచ్చెన్నాయుడు డిపార్ట్మెంట్ కి తాళం వేసేయండి.. ఎందుకంటే, ఆయనకి దాని మీద అవగాహన లేదనిపిస్తుంది అన్నారు. అచ్చెన్నాయుడుకి నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల ధరలు తగ్గించాలని అచ్చెన్న చెప్పారేమో.. మార్కెట్ లో పాల పాకెట్ ధరలు పెరిగిపోతున్నాయి.. దీంతో దేశంలో అతి పెద్ద డైరీని చంద్రబాబు సంపాదించాలని అనుకుంటున్నారా? అని సీదిరి అప్పల రాజు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!