Botsa Satyanarayana: బాబు, పవన్ ప్రశ్నిస్తే తాట తీస్తారట..! ఎందుకు నిలదీయకూడదు..?
- మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్పై బొత్స ఫైర్..
- బాబు, పవన్ ప్రశ్నిస్తే తాట తీస్తాం అంటున్నారు..
- ప్రశ్నించకపోతే పనే చేయడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ను ప్రశ్నిస్తే తాట తీస్తాం, మక్కెలు ఇరగ కొడతాం అంటున్నారు.. కానీ, ప్రశ్నించకపోతే పనే చేయడం లేదన్నారు.. బాబు మేనిఫెస్టో గుర్తు చేసే కార్యక్రమం చేపట్టాం.. కూటమి ప్రభుత్యంపై బురదజల్లడం వైసీపీ ఉద్దేశం కాదు అన్నారు.. ప్రభుత్యం హామీలు అమలు చేయక పోతే ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది.. మాయ, మోసం చేయటం లేదా, దగా చేయటం లేదా..? మిమ్ములను ఎందుకు నిలదీయకూడదు..? అని మండిపడ్డారు బొత్స..
Read Also: IND vs ENG Test: డబుల్ సెంచరీ దిశగా గిల్.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న జడేజా..!
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
మేం అడగక పోతే తల్లికి వందం వేసేవారా? అని ప్రశ్నించారు బొత్స.. అరెస్టులకు, తాటకుచప్పులకు భయపడం అని స్పష్టం చేశారు. మేం మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి అమలు చేశాం. అందుకే, మీరు ఎన్నికల్లో ఇచిన మేనిఫెస్టో అమలు చేయాలని కోరుతున్నాం అన్నారు.. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాం అన్నారు.. మరి ఏంమైంది అని ప్రశ్నించారు.. ఇక, సీఎం చంద్రబాబు 100 అబద్ధాలు చెబితే, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ 200 అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.. 43 శాతం పైగా ఓటింగ్ వచ్చినా ఏదో జరిగా ఓడిపోయాం.. మేం ప్రజల్లో తేల్చుకుంటాం అన్నారు బొత్స.. మరోవైపు, పక్కన ఉన్న విశాఖకు విమానాలు తగ్గిస్తే దిక్కులేదు.. కానీ, కర్నూలుకు విమానాలు తెస్తాం అంటారని విమర్శించారు.. జగన్ పరామర్శలకు వెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు, మహిళలు మోసం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి తిరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!