Botsa Satyanarayana: బాబు, పవన్ ప్రశ్నిస్తే తాట తీస్తారట..! ఎందుకు నిలదీయకూడదు..?
- మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్పై బొత్స ఫైర్..
- బాబు, పవన్ ప్రశ్నిస్తే తాట తీస్తాం అంటున్నారు..
- ప్రశ్నించకపోతే పనే చేయడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ను ప్రశ్నిస్తే తాట తీస్తాం, మక్కెలు ఇరగ కొడతాం అంటున్నారు.. కానీ, ప్రశ్నించకపోతే పనే చేయడం లేదన్నారు.. బాబు మేనిఫెస్టో గుర్తు చేసే కార్యక్రమం చేపట్టాం.. కూటమి ప్రభుత్యంపై బురదజల్లడం వైసీపీ ఉద్దేశం కాదు అన్నారు.. ప్రభుత్యం హామీలు అమలు చేయక పోతే ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది.. మాయ, మోసం చేయటం లేదా, దగా చేయటం లేదా..? మిమ్ములను ఎందుకు నిలదీయకూడదు..? అని మండిపడ్డారు బొత్స..
Read Also: IND vs ENG Test: డబుల్ సెంచరీ దిశగా గిల్.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న జడేజా..!
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
మేం అడగక పోతే తల్లికి వందం వేసేవారా? అని ప్రశ్నించారు బొత్స.. అరెస్టులకు, తాటకుచప్పులకు భయపడం అని స్పష్టం చేశారు. మేం మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి అమలు చేశాం. అందుకే, మీరు ఎన్నికల్లో ఇచిన మేనిఫెస్టో అమలు చేయాలని కోరుతున్నాం అన్నారు.. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాం అన్నారు.. మరి ఏంమైంది అని ప్రశ్నించారు.. ఇక, సీఎం చంద్రబాబు 100 అబద్ధాలు చెబితే, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ 200 అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.. 43 శాతం పైగా ఓటింగ్ వచ్చినా ఏదో జరిగా ఓడిపోయాం.. మేం ప్రజల్లో తేల్చుకుంటాం అన్నారు బొత్స.. మరోవైపు, పక్కన ఉన్న విశాఖకు విమానాలు తగ్గిస్తే దిక్కులేదు.. కానీ, కర్నూలుకు విమానాలు తెస్తాం అంటారని విమర్శించారు.. జగన్ పరామర్శలకు వెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు, మహిళలు మోసం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి తిరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు రాబోతున్న అద్భుతమైన ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!