Botsa Satyanarayana: బాబు, పవన్ ప్రశ్నిస్తే తాట తీస్తారట..! ఎందుకు నిలదీయకూడదు..?
- మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్పై బొత్స ఫైర్..
- బాబు, పవన్ ప్రశ్నిస్తే తాట తీస్తాం అంటున్నారు..
- ప్రశ్నించకపోతే పనే చేయడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ను ప్రశ్నిస్తే తాట తీస్తాం, మక్కెలు ఇరగ కొడతాం అంటున్నారు.. కానీ, ప్రశ్నించకపోతే పనే చేయడం లేదన్నారు.. బాబు మేనిఫెస్టో గుర్తు చేసే కార్యక్రమం చేపట్టాం.. కూటమి ప్రభుత్యంపై బురదజల్లడం వైసీపీ ఉద్దేశం కాదు అన్నారు.. ప్రభుత్యం హామీలు అమలు చేయక పోతే ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది.. మాయ, మోసం చేయటం లేదా, దగా చేయటం లేదా..? మిమ్ములను ఎందుకు నిలదీయకూడదు..? అని మండిపడ్డారు బొత్స..
Read Also: IND vs ENG Test: డబుల్ సెంచరీ దిశగా గిల్.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న జడేజా..!
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
మేం అడగక పోతే తల్లికి వందం వేసేవారా? అని ప్రశ్నించారు బొత్స.. అరెస్టులకు, తాటకుచప్పులకు భయపడం అని స్పష్టం చేశారు. మేం మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి అమలు చేశాం. అందుకే, మీరు ఎన్నికల్లో ఇచిన మేనిఫెస్టో అమలు చేయాలని కోరుతున్నాం అన్నారు.. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాం అన్నారు.. మరి ఏంమైంది అని ప్రశ్నించారు.. ఇక, సీఎం చంద్రబాబు 100 అబద్ధాలు చెబితే, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ 200 అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.. 43 శాతం పైగా ఓటింగ్ వచ్చినా ఏదో జరిగా ఓడిపోయాం.. మేం ప్రజల్లో తేల్చుకుంటాం అన్నారు బొత్స.. మరోవైపు, పక్కన ఉన్న విశాఖకు విమానాలు తగ్గిస్తే దిక్కులేదు.. కానీ, కర్నూలుకు విమానాలు తెస్తాం అంటారని విమర్శించారు.. జగన్ పరామర్శలకు వెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు, మహిళలు మోసం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి తిరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!