Botsa Satyanarayana: ప్రభుత్వంలోని పార్టీలు సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాయి..
- శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరం..
- కూటమి ప్రభుత్వంలోని పార్టీలు సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాయి..
- మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి: బొత్స సత్యనారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరం అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మరణించిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి తొక్కిసలాట సంఘటనలు మూడుసార్లు జరిగాయని గుర్తు చేశారు. ఆలయ ప్రతిష్టాపన తర్వాత ప్రతి శనివారం సుమారు 2 వేల మంది వస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. కానీ, నిన్న ఎక్కువ జనం పెరిగారని తెలిపారు. తాము ఈ విషయంపై రాజకీయం చేయదలచుకోలేదని, కానీ ప్రభుత్వం తమ బాధ్యతలు మార్చిపోయిందని బొత్స కోరారు.
Read Also: Jogi Ramesh: నాలుగు గంటలుగా పోలీస్ స్టేషన్లోనే జోగి రమేష్.. ఇంట్లో సిట్ సోదాలు!
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
ఇక, స్థానిక పోలీసులు ఇద్దరు ముగ్గురు పంపించి ఉంటే సరిపోయేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలని, సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎవరిపై నిర్దిష్ట చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా అని సందేహం వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాయని ఎత్తి చూపారు. ప్రభుత్వ దుర్మార్గాల కారణంగా ఎలాంటి చర్యలు జరుగుతున్నాయో చూడొచ్చు.. సీఎం చంద్రబాబు, లోకేష్, ఆనం బాధ్యత వహిస్తారా అని నిలదీశారు. రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలి.. కేవలం గాలి కబుర్లు చెప్పడానికి కాదు అధికారం కట్టబెట్టింది అని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ప్రాణాలకు విలువ కట్టలేమని, మానవత్వం తో వ్యవహరించాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోరారు.
Read Also: India vs South Africa: మహిళల వరల్డ్ కప్ ఫైనల్కు వానగండం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి..?
అలాగే, పలాస తొక్కిసలాట ఘటనను ప్రక్కదోవ పట్టించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని బొత్స సత్యనారాయణ తెలిపారు. జయచంద్రా రెడ్డినీ ఎందుకు వదిలేశారు.. ప్రభుత్వం ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో, లబ్ధి కోసం ఆలోచిస్తుందన్నారు.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!