Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు వైసీపీ బిగ్ షాక్.. ఆ వివాదమే కారణం..!
- టెక్కలి ఇంఛార్జ్ పదవి నుంచి దువ్వాడ శ్రీను తొలగింపు..
- దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ను నియమించిన జగన్..
- పదిరోజులుగా దువ్వాడ కుటుంబంలో వివాదం..
- ఇంటి వివాదంతో రోడ్డెక్కిన దువ్వాడ ఫ్యామిలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. టెక్కలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరాడ తిలక్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఆయన సతీమణి టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి మధ్య వివాదం నెలకొంది. అదికాస్తా చినికిచినికి గాలి వానలా మారింది. దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్ మధ్య సంబంధం బయటకు రావడం రచ్చకు దారితీసింది. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారంటూ వాణి నిరసన చేపట్టింది. 15 రోజులుగా శ్రీనివాస్ ఇంటి ఆవరణలోనే కారు షెడ్లో పడుకుంటూ దువ్వాడ శ్రీను వైఖరిపై దుమ్మెత్తి పోసింది. దువ్వాడ వాణితో పాటు కుమార్తె హైందవి కూడా శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
Read Also: National Space Day: నేడే మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం..
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
ఇక.. ఈ వ్యవహారంలో ఇరువర్గాలపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఐదు షరతులతో కుటుంబ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేశారు. కానీ అవి కూడా సఫలం కాలేదు. దీంతో దువ్వాడ శ్రీనివాస్-వాణి వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. మాధురి సైతం సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య బంధంపై రచ్చ చేసింది. దువ్వాడ వాణి స్థానిక జడ్పీటీసీ… కాగా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ వ్యవహారం పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తోందని హైకమాండ్ భావించింది. దువ్వాడ శ్రీనివాస్ను ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. కొత్త ఇంచార్జ్గా పేరాడ తిలక్ను నియమించింది. దీంతో.. కుటుంబ వ్యవహారం కాస్తా దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ కెరీర్పై ప్రభావాన్ని చూపినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?