Tragedy: మృత్యువులోనూ వీడని బంధం.. నిన్న తల్లి, నేడు బిడ్డ మృతి..
- మృత్యువులోనూ వీడని బంధం..
- నిన్న తల్లి.. నేడు బిడ్డ మృతి..
- తీవ్ర విషాదంలో కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: మృత్యువు కూడా ఓ తల్లి–బిడ్డ బంధాన్ని విడదీయలేకపోయింది.. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా.. ఇవాళ అదే చిన్నారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వరుస మరణాలతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. హిందూపురం మండలం బసనపల్లి ఆటోనగర్కు చెందిన ఖలీమ్ – నజ్మా దంపతులు జీవనం సాగించగా.. నజ్మాకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సురక్షితంగా డెలివరీ అయిన నజ్మా.. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ప్రసవం అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. డాక్టర్ల సూచనతో ఆమెను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తల్లి నజ్మా ప్రాణాలు విడిచింది.
Read Also: Allu Sirish : అల్లు శిరీష్.. పెళ్లి డేట్ ఫిక్స్..
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
అయితే, పండంటి బిడ్డను చేతుల్లోకి తీసుకునేలోపే తల్లి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఇంకా తీరని విషాదం ఆ కుటుంబాన్ని వెంటాడింది. నజ్మా మృతదేహాన్ని అంబులెన్స్లో హిందూపురానికి తరలిస్తుండగా, పసిబిడ్డను కూడా అదే అంబులెన్స్లో తీసుకెళ్లారు. హిందూపురం సమీపంలో.. పొగమంచు తీవ్రత కారణంగా రోడ్డు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.. ఈ క్రమంలో అంబులెన్స్ ముందు వెళ్తున్న లారీని బసనపల్లి ఆటోనగర్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి మృతదేహంతో పాటు ప్రయాణిస్తున్న శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. నిన్న తల్లిని కోల్పోయిన కుటుంబం.. ఇవాళ పసిబిడ్డను కూడా పోగొట్టుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆటోనగర్ ప్రాంతం మొత్తం ఈ ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇక, రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొగమంచు, నిర్లక్ష్య డ్రైవింగ్ లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తల్లి–బిడ్డ మృతితో ఆ కుటుంబంలో మృత్యువులోనూ వీడని బంధం కథ స్థానికులను కలచివేస్తోంది. అప్పుడే లోకాన్ని చూడాల్సిన చిన్నారి.. తల్లిని వెంబడించినట్టే మరణించడం విధి వైపరీత్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!