MP Parthasarathy: మంత్రి సవితతో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ
- మంత్రి సవిత.. హిందూపురం ఎంపీ పార్థసారథి మధ్య విభేదాలు..!
- మంత్రి సవితకు నాకు ఎటువంటి గొడవలు లేవు..
- కలిసే పని చేస్తాం అంటూ వైరానికి తెరదించిన ఎంపీ పార్థసారథి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Parthasarathy: మంత్రి సవిత.. హిందూపురం ఎంపీ పార్థసారథి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చారు హిందూపురం ఎంపీ పార్థసారథి.. కార్యకర్తల్ని విస్మరిస్తే, వారిని కాపాడలేక పోతే నాయకులకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.. కానీ, మంత్రి సవితకు నాకు ఎటువంటి గొడవలు లేవు, కలిసే పని చేస్తాం అంటూ ఎంపీ పార్థసారథి వారి ఇరువురి మధ్య ఉన్న వైరానికి తెరదించారు.
Read Also: INDIA Bloc: చీలిక దిశగా ఇండియా కూటమి!? నాయకులు కీలక వ్యాఖ్యలు
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
కాగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ పార్థసారథి ఆశించి భంగపడ్డారు, ప్రస్తుత మంత్రి సవిత అప్పట్లో తెలుగుదేశం పార్టీ టికెట్ను సాధించి గెలిచి మంత్రి అయ్యారు. అప్పటినుండి పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి మరియు పార్థసారథి ఎంపీ వర్గాలుగా విడిపోయారనే విమర్శలు ఉన్నాయి.. ఈరోజు సోమందేపల్లిలో జరిగిన భగీరథ కళ్యాణమండపం భూమి పూజలో మంత్రి మరియు ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. సభలో మంత్రి మాట్లాడుతూ ఎంపీ పార్థసారథి 80 లక్షల రూపాయలు భగీరథ కళ్యాణ మండపానికి కేటాయించడం సంతోషకరమని అన్నారు. ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో స్వార్థపరులుగా తామిద్దరం వ్యవహరించినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.. తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని పరిటాల రవి, పరిటాల సునీత అప్పటి మంత్రి రామచంద్ర రెడ్డితో కలిసి పని చేసిన ఎప్పుడూ విభేదాలు రాలేదని మరి ఎందుకు ఇప్పుడు మంత్రి సవితతో విభేదాలు వచ్చాయో అర్థం కాలేదన్నారు.. అయితే, కొంతమంది స్వార్థపరులు ఇద్దరు మాట్లాడకుండా ఉంటే వారికి పబ్బం గడపదని విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. ఇద్దరి మధ్య విభేదాల వల్ల కార్యకర్తలు దెబ్బతింటున్నారని, ఇక నుండి తాము కలిసి పనిచేసి అభివృద్ధికి పాటుపడతామని ఎంపీ పార్థసారథి స్పష్టం చేశారు..
తాజావార్తలు
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!