Somireddy Chandramohan Reddy: అవును జగన్ అన్నదే కరెక్ట్.. ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్..!
- వైఎస్ జగన్ పై సోమిరెడ్డి సెటైర్లు..
- వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ అన్నారు..
- ఇది కరెక్ట్.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు..
- అది జగన్ మేడ్ మిస్టేక్ అంటూ ఎద్దేవా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy Chandramohan Reddy: వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ అన్నారు.. ఇది కరెక్ట్.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు… కాబట్టి అది జగన్ మేడ్ మిస్టేక్ అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల్లో ఏలేరు పొంగి ప్రవహించింది.. భారీ వర్షం నమోదైంది.. కానీ, ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల ప్రాణ నష్టం తప్పిందన్నారు.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నపుడు 17 వేల క్యూసెక్కుల నీరు వస్తే కాకినాడ వరకూ నీళ్లు వచ్చాయి.. ఇప్పుడు 42 వేల క్యూసెక్కుల నీరు వచ్చినా.. ముందు చూపుతో నీటిని వదిలి నష్టాన్ని నివారించారని స్పష్టం చేశారు..
Read Also: Devara : దేవర ప్రమోషన్స్ అంతా గప్ చుప్.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
ఇక, జగన్ కు క్యూ కెక్కులు తెలీదు.. టీఎంసీలు అంటే తెలియదు అని ఎద్దేవా చేశారు.. ఇన్ ఫ్లో.. ఔట్ ఫ్లో అంటే కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు సోమిరెడ్డి.. ప్యాలస్లో కూర్చుని పాలించాడు.. జగన్ హయాంలో జలవనరులు.. వ్యవసాయ శాఖలు మూత పడ్డాయి.. జగన్ వల్ల పీఎల్ఆర్ కంపెనీ బాగు పడింది.. జగన్ హయంలో ఉన్న జలవనరుల శాఖ మంత్రి డాన్స్ లకు పరిమితమయ్యారు అని విమర్శించారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి టపాకాయలు కాల్చడం ఎంతవరకూ సబబు? అని ప్రశ్నించారు వరద బాధితుల పరామర్శకు వెళ్లిన జగన్.. ముద్దులు పెడుతున్నారు.. ఏలేరు ప్రాంతంలో ఒకే రోజు 17 సెంటీమీటర్ల వర్షం వచ్చింది.. అందువల్లే లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. ఏలేరు ఆధునికీకరణకు జగన్ హయాంలో నిధులు ఇవ్వలేదు.. వరద బాధితుల కోసం జగన్ కోటి రూపాయలు మాత్రమే విరాళం ఇచ్చారు.. దేశంలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో జగన్ మూడవ వారు.. అలాంటి వ్యక్తి కోటి రూపాయలు ఇవ్వడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. వరద బాధితులు జగన్ పరామర్శించలేదు.. కేవలం తన అనుచరులు ఉన్న ప్రాంతంలో మాత్రమే పర్యటించారు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!