Kakani Govardhan Reddy: జగన్ తీసుకొచ్చిన వ్యవస్థ ఉండకూడదనే నిర్వీర్యం చేస్తున్నారు..
- అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు..
- జగన్ తీసుకొచ్చిన వ్యవస్థ ఉండకూడదనే నిర్వీర్యం చేస్తున్నారు..
- రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన చేస్తాం: కాకాణి గోవర్థన్ రెడ్డి
Kakani Govardhan Reddy: అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు.. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు.. గత ప్రభుత్వంలో ఎకరాకు లక్ష రూపాయలు అదనంగా ఆదాయం వస్తే.. ఇప్పుడు ఎకరానికి రూ. 40 వేల దాకా రైతులు నష్టపోతున్నారు అని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటల్లో తప్ప.. చేతల్లో లేదు అని విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలోనే రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు.. టీడీపీ గెజిట్ పత్రికల్లోనే వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ అన్నారు.
Read Also: Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకంపై నిషేధం
Also Read
ఇక, మిర్చి రైతులు ధరలు లేక అల్లాడిపోతున్నారు అని కాకాణీ గోవర్థన్ రెడ్డి తెలిపారు. రూ. 6 వేల కోట్ల రూపాయలు మేర మిర్చి రైతులు నష్టపోతున్నారు.. దళారులు దోచుకుంటుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తోంది అని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది.. అన్నదాత.. సుఖీభవ పథకం అమలు చేయకపోవడం వల్ల.. అప్పులు తెచ్చుకుని రైతులు వ్యవసాయం చేస్తున్నారు.. పెట్టుబడులు పెరిగి.. రాబడి తగ్గడంతో రైతులు అప్పులు ఊబిలో ఇరుక్కొంటున్నారు అని పేర్కొన్నారు. జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలు ఉండకూడదనే కక్షతో.. రైతులను చంద్రబాబు రోడ్డున పడేస్తున్నాడు.. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే అన్నదాతలను కలుపుకుని ఆందోళనకు శ్రీకారం చూడతామని మాజీ మంత్రి కాకాణీ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!