చంద్రబాబు మౌనం వెనక వ్యూహం.. ఇదే అయితే పార్టీ శ్రేణులకు పండగే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారా? పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే క్రమంలో.. ఆయన సరికొత్త ఆలోచనలు చేస్తున్నారా? సరికొత్త గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు.. ఆయన వ్యవహారశైలి అవుననే సమాధానం చెబుతోంది. సందర్భానుసారం మాట్లాడ్డం.. ముఖ్యమైన విషయాలపై ట్వీట్లు చేయడం తప్ప.. పెద్దగా హడావుడి చేయకుండా.. ఆయన ఎదురుచూస్తున్న తీరు సైతం.. సరికొత్త వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. చంద్రబాబు 3 ప్రధాన విషయాలపై దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో ఒకటి రాష్ట్ర అప్పులు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో చేసిన అప్పులను ఇప్పటి జగన్ ప్రభుత్వం ఏడాదిలోనే చేసిందంటూ పార్టీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి స్థాయి లెక్కలను రెడీ చేసి.. ప్రభుత్వంపై పోరాటానికి ఈ అంశాన్ని ప్రధాన ఆయుధంగా చంద్రబాబు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇక రెండోది.. జగన్ పై ఉన్న కేసులు. ఈ విషయం వారం వారం కాస్త సాగదీతగా ముందుకు జరుగుతోంది. అందులోనూ.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ అంశంలో తీర్పు రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైనా దృష్టి పెట్టిన చంద్రబాబు.. తర్వాత రాబోయే స్పష్టమైన పరిణామాలను తనకు.. ముఖ్యంగా టీడీపీ మనుగడకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. న్యాయ పరమైన విషయాలపై అపరిమితమైన పట్టు ఉన్న చంద్రబాబు.. ఈ విషయాలపై కాస్త ఎక్కువగానే దృష్టి పెడుతున్నట్టుగానూ తెలుస్తోంది. ప్రత్యర్థి దూకుడుకు దీంతోనే ఆయన అడ్డుకట్ట వేసే అవకాశమూ ఉంది.
Also Read
మూడో అంశం. రాష్ట్రంలో దాడులు.. నిరుద్యోగుల సమస్యలు. దిశ చట్టం అమల్లోకి వచ్చినా.. అక్కడక్కడా జరుగుతున్న దాడులను టీడీపీ హైలైట్ చేస్తోంది. లోకేష్ ఈ విషయాన్ని లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. నిరుద్యోగుల సమస్యపైనా.. టీడీపీ నేతలు కాస్త ఎక్కువగానే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. రాను రాను ఈ విషయాన్ని సైతం చంద్రబాబు సీరియస్ గా తీసుకుని.. జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక చివరి అస్త్రంగా.. తాను కానీ.. లోకేశ్ కానీ.. పాదయాత్ర చేస్తే.. జనాల్లోకి వెళ్లి.. పార్టీకి మళ్లీ క్రేజ్ తీసుకువస్తే ఎలా ఉంటుందని కూడా.. చంద్రబాబు ఆలోచన చేయవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. పార్టీ శ్రేణులకు పండగే అని చెప్పవచ్చు. మళ్లీ జనాల్లోకి వేగంగా దూసుకువెళ్లేందుకు అదో అవకాశంగా టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం భావించవచ్చు. చూడాలి మరి.. చంద్రబాబు ఆలోచనలు.. అడుగులు ఎలా ఉన్నాయో.
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!