Speaker Ayyanna Patrudu: ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు..!
- జగన్ మొదటి నుంచి అసెంబ్లీకి రావాలని కోరాను..
- ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు.. జగన్కి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు..
- ప్రతిపక్ష నేత హోదా కావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.. జగన్కి ఉంది 11 సీట్లే: అయ్యన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇందులో భాగంగానే, ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వ్యవహారాలపై ట్రైనింగ్ ఉంటుంది.. ఈ సారి ఏపీలో గెలిచిన వాళ్లలో ఎక్కువ మంది కొత్త ఎమ్మెల్యేలే ఉన్నారు.. కాబట్టి, ఎమ్మెల్యేల ట్రైనింగ్ ప్రారంభానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారని చెప్పుకొచ్చారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగింపు రోజున మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
Read Also: Harish Rao : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరి బ్రతుకులు రోడ్డున పడ్డాయి
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మొదట నుంచి అసెంబ్లీకి రావాలని కోరాను అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆయన సమావేశాలకు రావడం లేదు.. ఆయనకు అవగాహన ఉందో లేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన సమయం నాకు కూడా ఇవ్వాలని జగన్ అంటున్నారు.. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు.. ఆయనకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని వెల్లడించారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు కావాలి అని సూచించారు. జగన్ కి వచ్చింది 11 సీట్లు మాత్రమే అని స్పీకర్ అయ్యన్న తెలిపారు.
Read Also: Allu Aravind: చరణ్ నా కొడుకు లాంటోడు.. ఇక్కడితో ఆపేయండి!
అలాగే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ.. జగన్ ప్రెస్ మీట్ లో హైకోర్టు ఏపీ స్పీకర్ కి నోటీసులు పంపిందని చెప్పారు.. కోర్టులు స్పీకర్లకు సమన్లు ఇవ్వలేదు.. ఇవ్వడానికి కూడా వీల్లేదు అన్నారు. గతంలో ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, సీఎంగా చేసిన జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా.. రాకపోయినా.. ఎమ్మెల్యేల అవగాహన సదస్సుకు రావాలని కోరుకుంటున్నాను.. శాసన వ్యవస్థ, ఎమ్మెల్యేల పాత్ర, ప్రవర్తన నియమావళిపై ఒక పుస్తకాన్ని ఎమ్మెల్యేలు అందరికీ అందజేస్తామని ఆయన వెల్లడించారు. తగువులాట లేకుండా సభను హుందాగా నిర్వహించడం కోసం ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం.. శాసన సభ్యుడు 60 రోజుల సమావేశాలకు హాజరుకాకపోతే వారి సభ్యత్వం రద్దు అవుతుంది.. సెలవు కోరుతూ ఇప్పటి వరకు జగన్ లేఖ పెట్టుకోలేదు అని రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!