రాయలసీమలో ఆర్థిక వనరులున్నా అభివృద్ధిలేకుండా చేశారు: సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల కోర్కెలు తీర్చడంలో… ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ, వైసీపీ పార్టీలపై విమర్శల దాడులకు దిగారు. రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాయలసీమలో ఎర్రచందనం, ముగ్గురాయి, చాలా ఖనిజాలు ఉన్నప్పటికీ.. ఇక్కడివారు ముఖ్యమంత్రులుగా ఉన్నా అభివృద్ధి లేకుండా చేశారన్నారు. అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నా అభివృద్ధి శూన్యమన్నారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామన్నారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ర్టం నిధులు ఇవ్వకున్న మేము పూర్తి చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కడప, కర్నూలులో మోడీ ప్రభుత్వం ఎయిర్పోర్టులు నిర్మిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం బస్టాండ్లను ప్రయివేట్ పరం చేస్తుందని మండిపడ్డారు. సర్పంచ్ల నిధులు వెనక్కి తీసుకుంటున్నారు, ఎన్ ఆర్ఈజీఎస్ నిధులను దారి మళ్లించారన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు మట్టి,ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోలవరం తప్ప తెలుగు గంగ, హంద్రీనీవా అక్కరలేదా ఎందుకు వీటిపై రెండు పార్టీలు మాట్లాడటం లేదని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.
Read Also: కోర్టులు మొట్టికాయలు వేస్తే కానీ సారుకు బాధ్యతలు గుర్తుకు రావు: షర్మిల
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
రాష్ట్రంలో కేవలం మోడీ ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. సిమెంటును రూ. 330 కి ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 200 ఇస్తామని సోము వీర్రాజు అన్నారు. పిల్లలకు సరైన కోడిగుడ్లు ఇవ్వలేని పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో కోళ్లఫారం పెట్టి నాణ్యమైన నాటి కోడి గుడ్లను సరఫరా చేస్తామన్నారు.పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని భవిష్యత్తులో బీజేపీ పోరాటాలు చేస్తుందన్నారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడు బడ్డా శ్రీకాంత్ రెడ్డి పై దాడి కి నిరసనగా ఈనెల 22 న 175 నియోజకవర్గాల్లో ప్రజా నిరసన సభలు నిర్వహించనున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలపై దాడి చేస్తే అడిగే దిక్కులేదన్నారు. మసీదులు కట్టడం, టిప్పు విగ్రహ ఏర్పాటు… రాముడి శిరక్షేధనం.. రథం తగలబడడం వంటివి జరిగితే అడిగేవారు లేరని, వైఎస్ విగ్రహనికి ఏమైనా జరిగితే వెంటనే అరెస్టులు చేస్తున్నారనిసోము వీర్రాజు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
- Tags
- ap
- bjp
- Rayalaseema
- Somu Veerraju
- tdp
తాజావార్తలు
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోన్? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!