Somu Veerraju: ఏపీలో బీజేపీదే అధికారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొత్తులపై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారు. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించాం. ఇక గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్దంగా లేదని స్పష్టంగా చెబుతున్నాం. అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉంది. కుటుంబ పార్టీలకోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. త్యాగ ధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. 2024లో మోడీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్ కుమార్ చాహర్, శశిభూషణ్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఏపీలో రైతులను సంస్కరించడంలో అధికారాన్ని అనుభవించిన కుటుంబ పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందాయి.రైతు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతును పూర్తిగా మోసగించారు.గతంలో చంద్రబాబు, నేడు జగన్ ప్రభుత్వాలు ఈ అంశంలో దగ చేస్తున్నాయి.
Also Read
మిల్లర్ల చేతిలో కీలు బొమ్మలుగా చంద్రబాబు, జగన్ మారారు.రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులైతే మోచేతి కింద నీళ్లు తాగే విధానంలో వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులు కలిసి రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా నట్టే ముంచారు.జగన్ ప్రభుత్వం పూర్తిగా రైస్ మిల్లర్లకు అండగా నిలుస్తూ అక్రమాలకు అండగా ఉంటుంది.రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఛైర్మనునే.. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మనుగా నియమించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే తండ్రిని ఛైర్మన్ చేయడం ద్వారా.. రైతులను మోసగించే వైఖరి అవలంబిస్తున్నారు. కేంద్రం ఇచ్చే అనేక సబ్సిడీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది.
దేశానికి వెన్నెముక అయిన రైతును ఆదుకోవాలని మోడీ అనేక పధకాలు అమలు చేస్తున్నారన్నారు సోము వీర్రాజు. మాట మాటకి సంక్షేమ కార్యక్రమం అనే జగనుకు.. కేంద్రం అమలు చేసే పధకాలు సంక్షేమాన్ని గుర్తు చేయడం లేదేం? ప్రధాని అమలు చేసే సంక్షేమం ముందు.. జగన్ సంక్షేమం తీసికట్టు. అన్ని వర్గాల వారికి మోడీ ప్రాధాన్యత ఇచ్చి పధకాలను అమలు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు వికాసం, విజ్ఞానంతో ఆలోచించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేంద్రం అమలు చేస్తున్న అనేక పధకాలను ప్రజలకు వివరిస్తూ, జగన్ మోసాలను బయట పెట్టండి. ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడే దమ్ము, ధైర్యం ఒక్క బీజేపీకే ఉందన్నారు సోము వీర్రాజు.
YS Sharmila : కెసిఆర్ జిల్లాలోనే ఇలా ఉంటే.. మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి ?
తాజావార్తలు
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!