YS Sharmila : కేసీఆర్ జిల్లాలోనే ఇలా ఉంటే.. మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి ?
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన సమస్య వడ్లు కొనుగోళ్లని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రైతులు తాము వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా ”రైతుగోస” పేరుతో సమస్యలను ప్రస్తావించినా సీఎం స్పందిచలేదని అన్నారు.
సూర్యాపేట మార్కెట్ యార్డ్ లో 5 రోజుల నుంచి పండించిన పంటను కుప్పలు వేసుకొని రైతులు అక్కడే ఉన్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది రైతులకు మద్దతు ధర రావటం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ లోకి తెచ్చిన పంటని వెనక్కి తీసుకువెళ్లలేక రైతులు అగచాట్లు వర్ణణాతీతమని అన్నారు. కేవలం 1500 రూపాయలకు పంటను అమ్ముకునే దుస్థితి రైతులకు ఏర్పడిందన్నారు.
Also Read
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
- Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
మద్దతు ధర 1960 రూపాయలు అయితే.. ఒకరో, ఇద్దరికో ఆధర వేసి తూతూ మంత్రంగా కానిస్తున్నారని మండిపడ్డారు. 70 శాతం మందికి మద్దతు ధర రావటం లేదని షర్మిల అన్నారు. మెదక్ మార్కెట్ యార్డ్ పరిస్థితి కూడా చాలా దారుణంగా వుందని, అక్కడి రైతులు 20 రోజులుగా కుప్పలు వేసుకుని, ఇంటికి దూరంగా వున్నారని ఆమె అన్నారు. సీఎం కెసిఆర్ జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా జిల్లాల పరిస్థితి ఏంటని షర్మిల మండిపడ్డారు. నీ మాట నమ్మి వరి వేసుకోకుండా ఉన్నందుకు వారికి సీఎం పార్టీ అకౌంట్ లో ఉన్న 850 కోట్లు నుంచి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కాదు.. రైతులకు బోనస్ ఇవ్వాలన్నారు. 24గంటల కరెంట్ ఇస్తామన్నారు.. కానీ 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేల్కొని.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రావలని షర్మిల అన్నారు.
Nagaraju Murder: నాగరాజు హత్యలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతలు
తాజావార్తలు
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
-
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
-
Jio Rs 209 Plan: జియో యూజర్స్కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
-
Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!