Somu Veerraju: కన్నా వ్యాఖ్యలపై అప్పుడు స్పందించలేదు.. ఇప్పుడు అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. రాజీనామా చేసే సమయంలో.. అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ను టార్గెట్ చేసిన కన్నా.. బీజేపీని పార్టీలాగా కాకుండా.. ఏదో వ్యక్తిగత సంస్థలాగా నడుపుతున్నారు.. పార్టీలో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన విషయం విదితమే.. అయితే, కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కన్నా లక్ష్మీనారాయణ నాపై చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నారు.. కన్నా వ్యాఖ్యలపై అప్పుడు స్పందించలేదు.. ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో నడవాలంటే బీజేపీ, జనసేన ప్రభుత్వ స్థాపన జరగాలని అన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ఎంతో అభివృద్ది చెందిందిన్న సోము వీర్రాజు.. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు 60 శాతం నిధులను కేంద్రమే అందిస్తుందని మరోసారి చెప్పుకొచ్చారు..
Read Also: Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
మరోవైపు.. విజయవాడ ఇంద్ర కీలాద్రిపై జరిగిన వారాహి పూజా సమయంలో బీజేపీతో కలిసి ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను గుర్తుచేశారు సోము వీర్రాజు. కాగా, జనసేనతో తప్ప.. రాష్ట్రంలో మరో పార్టీతో పొత్తు ఉండబోదని.. కుటుంబ పార్టీలకు, కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గతంలోనూ స్పష్టం చేశారు సోమువీర్రాజు.. అయితే, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారిపోయింది.. గురువారం రోజు.. ఆయన బీజేపీకి రాజీనామా చేస్తూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లెటర్ పంపగా.. ఆయన బాటలో మరికొందరు నేతలు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. కాగా, బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. తన అనుచరులతో కలిసి త్వరలోనే టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందంటున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!