Somu Veerraju: కన్నా వ్యాఖ్యలపై అప్పుడు స్పందించలేదు.. ఇప్పుడు అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. రాజీనామా చేసే సమయంలో.. అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ను టార్గెట్ చేసిన కన్నా.. బీజేపీని పార్టీలాగా కాకుండా.. ఏదో వ్యక్తిగత సంస్థలాగా నడుపుతున్నారు.. పార్టీలో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన విషయం విదితమే.. అయితే, కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కన్నా లక్ష్మీనారాయణ నాపై చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నారు.. కన్నా వ్యాఖ్యలపై అప్పుడు స్పందించలేదు.. ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో నడవాలంటే బీజేపీ, జనసేన ప్రభుత్వ స్థాపన జరగాలని అన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ఎంతో అభివృద్ది చెందిందిన్న సోము వీర్రాజు.. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు 60 శాతం నిధులను కేంద్రమే అందిస్తుందని మరోసారి చెప్పుకొచ్చారు..
Read Also: Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం..
Also Read
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
మరోవైపు.. విజయవాడ ఇంద్ర కీలాద్రిపై జరిగిన వారాహి పూజా సమయంలో బీజేపీతో కలిసి ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను గుర్తుచేశారు సోము వీర్రాజు. కాగా, జనసేనతో తప్ప.. రాష్ట్రంలో మరో పార్టీతో పొత్తు ఉండబోదని.. కుటుంబ పార్టీలకు, కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గతంలోనూ స్పష్టం చేశారు సోమువీర్రాజు.. అయితే, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారిపోయింది.. గురువారం రోజు.. ఆయన బీజేపీకి రాజీనామా చేస్తూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లెటర్ పంపగా.. ఆయన బాటలో మరికొందరు నేతలు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. కాగా, బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. తన అనుచరులతో కలిసి త్వరలోనే టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందంటున్నారు.
తాజావార్తలు
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!