Somu Veerraju: సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ.. దానిపై అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సాంప్రదాయ వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి లేదు? అని లేఖలో ప్రశ్నించిన ఆయన.. ఈ విషయం ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగానైనా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని అందించిన భారత ఖండం ఖ్యాతిని తెలుసుకోండి.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని లేఖలో సూచించిన ఏపీ బీజేపీ చీఫ్.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని.. ఏపీ సర్కార్ అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.. తరతరాలుగా దేశీయ సాంప్రదాయ వైద్యం విశ్వవిఖ్యాతమైతే ముఖ్యమంత్రి ఎందుకు సుముఖంగా వ్యవహరించడం లేదు? అని నిలదీశారు.. ఆయుర్వేదం, సిద్దా, యునాని, హోమియో పతి, నాచురోపతి మొదలైన వైద్య విధానాలు ఎన్నో వ్యాధులను వాటి మూలాలను నివారించే దిశగా సమవర్ధవంతంగా పనిచేసే పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు.. రాష్ట్రప్రభుత్వానికి వాటిపై కనీస శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమంటూ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒక్క సారి కూడా ఈ శాఖలపై సమీక్ష నిర్వహించకపోవడం పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం అన్నారు సోము వీర్రాజు.. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి త్వరితగతిన ఆయా శాఖల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. వైరస్ ల వల్ల అనేక ఆరోగ్యపరమై న ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపత్కర సమస్యల ఎదుర్కొంటున్న దశలో అత్యధిక జనసాంధ్రత కలిగిన ఈ రాష్ట్రంలో అన్ని రకాల వైద్యవిధానాలు అందుబాటులోకి తీసుకుని రావలసిన భాధ్యత ప్రభుత్వానికి ఉండాలి.. సాంప్రదాయ వైద్యవిధానాల పట్ల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి విడనాడాలని ముఖ్యమంత్రి కి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.
తాజావార్తలు
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
-
Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!