Somu Veerraju: సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ.. దానిపై అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలి..
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సాంప్రదాయ వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి లేదు? అని లేఖలో ప్రశ్నించిన ఆయన.. ఈ విషయం ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగానైనా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని అందించిన భారత ఖండం ఖ్యాతిని తెలుసుకోండి.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని లేఖలో సూచించిన ఏపీ బీజేపీ చీఫ్.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని.. ఏపీ సర్కార్ అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.. తరతరాలుగా దేశీయ సాంప్రదాయ వైద్యం విశ్వవిఖ్యాతమైతే ముఖ్యమంత్రి ఎందుకు సుముఖంగా వ్యవహరించడం లేదు? అని నిలదీశారు.. ఆయుర్వేదం, సిద్దా, యునాని, హోమియో పతి, నాచురోపతి మొదలైన వైద్య విధానాలు ఎన్నో వ్యాధులను వాటి మూలాలను నివారించే దిశగా సమవర్ధవంతంగా పనిచేసే పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు.. రాష్ట్రప్రభుత్వానికి వాటిపై కనీస శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమంటూ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్తో పల్లెల్లో సరికొత్త విప్లవం
- Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
- AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒక్క సారి కూడా ఈ శాఖలపై సమీక్ష నిర్వహించకపోవడం పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం అన్నారు సోము వీర్రాజు.. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి త్వరితగతిన ఆయా శాఖల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. వైరస్ ల వల్ల అనేక ఆరోగ్యపరమై న ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపత్కర సమస్యల ఎదుర్కొంటున్న దశలో అత్యధిక జనసాంధ్రత కలిగిన ఈ రాష్ట్రంలో అన్ని రకాల వైద్యవిధానాలు అందుబాటులోకి తీసుకుని రావలసిన భాధ్యత ప్రభుత్వానికి ఉండాలి.. సాంప్రదాయ వైద్యవిధానాల పట్ల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి విడనాడాలని ముఖ్యమంత్రి కి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
West Bengal Election Results: బెంగాల్ ఫలితాల్లో ఏడు ‘M ఫ్యాక్టర్స్’ ప్రభావం.. ఎవరికీ పైచేయి..?
-
West Bengal ElectIon Results: ప్రధాని మోడీ ‘‘ఝల్మురి’’ తిన్న చోట బీజేపీ ఆధిక్యం..
-
Actor Vijay TVK Promises: తమిళనాడులో టీవీకే తుఫాన్.. బలమైన ఆరంభానికి నటుడు విజయ్ 7 అద్భుతమైన హామీలు
-
chandrabose: చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం..
-
Stock Market Rally: ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!