Somu Veerraju: అగ్నిపథ్ సాకు మాత్రమే.. ధ్వంసం వారి లక్ష్యం…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే.. అయితే, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ధ్వంస రచన ఒక పథకం ప్రకారం జరిగిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అగ్నిపథ సాకు మాత్రమే.. ధ్వంసం వారి లక్ష్యంగా పేర్కొన్న ఆయన.. విదేశీ శక్తులతో పాటు ఇక్కడ ఉన్న కొన్నివర్గాలు కలిపి చేస్తున్న విధ్వంసమే ఇది అని విమర్శించారు.. మీడియా ద్వారా వస్తున్న ఆడియో పరిశీలిస్తే ఒక గంటలో మొత్తం ధ్వంసం చేయాలని ఆడియో ఆదేశాలు వచ్చాయంటేనే అర్థం అవుతోందని.. ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర రైల్వే స్టేషన్లలో భద్రత పెంచాలని సూచించారు.. ఇదే సమయంలో రైల్వే ప్రయాణికులకు రక్షణ కల్పించాలని సూచించారు సోము వీర్రాజు.
Read Also: Minister Botsa: బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకున్నావా ..?
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.. ఇప్పటికే ఆర్మీ అభ్యర్థులు ఏఏ జిల్లాల నుంచి వచ్చారు.. వారిని రప్పించింది ఎవరు..? విధ్వంసానికి పాల్పడింది ఎవరు? అనే విషయాలను ఆరా తీస్తున్నారు.. కేసులు నమోదు చేసి ఇప్పటికే 22 మందిని అరెస్ట్ చేశారు.. మరోవైపు.. సికింద్రాబాద్ ఘటన వెనుక కీలక సూత్రధారిగా భావిస్తోన్న సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు విధ్వంసానికి ఎలా ప్లాన్ చేశారు.. అభ్యర్థులను ఎలా రప్పించారు..? దీని వెనుక దానికి ఉన్న కుట్ర కోణం ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!