Somu Veerraju: పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే. పోలవరం గురించి ప్రశ్నిస్తే.. రాష్ట్ర విభజన అంశాన్ని తిరగ తోడినట్లే. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలి. రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ. పోలవరం ముంపు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారు.వారంతా భద్రాచలం మీద ఆధార పడటం వల్ల అటు చూస్తున్నారు. విలీనం చేసిన మండలాల్లో సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి..? అన్నారు.
ఏం మాయ రోగం వచ్చింది.. టీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడి రోడ్డెక్కారా..? వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా..? చంద్రబాబు పోలవరం సోమవారం అని ఆర్భాటం చేశారు. పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బ తిన్నారు. చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారు. మూడేళ్లలో వాటిని బయట పెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు..? లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయం పై అధ్యయనం జరుగుతుందన్నారు సోము వీర్రాజు. రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదు. లక్షా నలభై వేల కార్డులు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారు. కేంద్రం గైడ్ లైన్సును పరిగణలోకి తీసుకున్నారా..?వీరిలో యాభై లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేదు. వీటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారు. కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సాగుతుంది. ఇతర దేశానికి ఇక్కడి నుంచే భారీగా వెళ్తుందని చెప్పడం విశేషం.బియ్యం కుంభకోణంపై వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా. వీటి వెనుక ఉన్న అందరి బాగోతాలు బయట పెడతాం అని ఆవేశంగా అన్నారు సోము వీర్రాజు.
కేంద్ర మంత్రి చెప్పినా జగన్ ప్రభుత్వం స్పందించదా..? కేశినేని ఏపీ ఏక్ నాథ్ షిండే కామెంట్లపై స్పందించారు సోము వీర్రాజు. కేశినేని కామెంట్లపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన. పరోక్షంగా కేశినేని కామెంట్లను సమర్థించారు సోము వీర్రాజు. ఎప్పుడో జరిగే అంశాలపై ఇప్పుడే ఎలా మాట్లాడతామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. కేశినేని నాని భవిష్యత్ గురించి మాట్లాడారు కదా..?అప్పుడే మాట్లాడతాం అన్నారు సోము.
తాజావార్తలు
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?