మరోసారి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఆయన నేడు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ బీజేపీ పోరాటం చేస్తోందని, సిద్ధాంతమని చెప్పుకొనే డీఎంకే పార్టీల కూడా కాంగ్రెస్తో పాటు కుటుంబ పార్టీ గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, అందుకే పోటీ చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయం పేరుతో వైసీపీ దగా చేస్తోందని, సామాజిక న్యాయం అయితే ఆత్మకూరులో బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
అభ్యర్థిని పోటీకి పెట్టవద్దని బీజేపీని అడిగే హక్కు వైసీపీకి లేదని ఆయన మండిపడ్డారు. స్థిరమైన సిద్ధాంతం టీడీపీ, వైసీపీలకు లేదన్న వీర్రాజు.. అందుకే తిరుపతిలో పోటీ చేసి.. బద్వేలులో ఎందుకు టీడీపీ పోటీ చేయలేదన్నారు. బద్వేలులో వైసీపీ ఒకో మండలానికి నలుగురు ఎమ్మెల్యేలను పెట్టి భారీగా డబ్బులు పంచారని, ఆత్మకూరులో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని చెబుతున్నారన్నారు. అయితే మంత్రులను ఎందుకు మండలాలకు ఇంచార్జిలుగా నియమిస్తారని, వైసీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.