Somu Veerraju: బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..? ఇలా స్పందించిన సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. అప్పటికే ఆయన బీజేపీ అగ్రనాయకత్వంలో మాట్లాడారని.. జాతీయ స్థాయిలో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని.. అన్ని సెట్ అవుతే.. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.. అయితే, చిత్తూరులో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కిరణ్ కుమార్ రెడ్డి ఇష్యూపై స్పందించారు.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికను స్వాగతించిన సోము వీర్రాజు.. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చురుకైన నాయకుడు.. కిరణ్ చేరిక రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి దోహదపడుతుంది. అతనికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు సోము వీర్రాజు.
Read Also: BRS Vs BJP: బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్.. నోటీసులు జారీ
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఇక, శాసన మండలి ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ముందుగానే ఓటమిని అంగీకరించినట్లు ఉందని వ్యాఖ్యానించారు సోము వీర్రాజు.. కనీసం పదవ తరగతి చదవని వారికి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో ఓటర్లుగా నమోదు చేయడం ప్రజాస్వామ్యనికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు.. పెద్దల సభను కలుషితం చేయడం నైతికతకాదన్న ఆయన.. గ్రాడ్యుయట్ కానీ వారికి ఓటు హక్కు కల్పించడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.. వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు వినియోగించడం సమంజసం కాదన్న ఆయన.. సక్రమంగా ఎన్నికలు జరిగితే ప్రజలు బటన్ నొక్కి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిధులతోనే ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇసుక, ఖనిజాలను వైసిపి ప్రభుత్వం దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. విశాఖపట్నంలో డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. బోగస్ ఓట్లు పై ఆధారాలతో ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు.
Read Also: Harish Shankar: అది అట్టా ఏసుకో మావా… ఆ కామెంట్స్ ఆ దర్శకుడికేనా?
మరోవైపు.. జనసేన పార్టీ. బీజేపీతోనే ఉందన్నారు సోము వీర్రాజు.. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు చెపుతున్నారు. ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఆయనకు కీలక బాధ్యతలను కూడా అప్పగించనున్నారని ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?