Somireddy: కేటీఆర్ ఎపిసోడ్.. సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి కేటీఆర్ పొరుగు రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేటీఆర్కు కౌంటర్ ఇస్తే.. కొందరు టీడీపీ నేతలు స్వాగతించారు.. మరికొందరు టీఆర్ఎస్-వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయితే, కేటీఆర్ ఎపిసోడ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నిన్నటి టీడీపీ నేతల కామెంట్లకు భిన్నంగా సోమిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు సోమిరెడ్డి.. తెలంగాణను చూసి ఏపీ కొన్ని అంశాలైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రైతు బంధు పథకం కింద తెలంగాణలో రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు.. ఏపీలో మాత్రం ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా కింద ఇచ్చేది ఒక్కో కుటుంబానికి రూ.7500 మాత్రమే అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు.. ఏపీలో మాత్రం 9 గంటల నుంచి 7 గంటలకు తగ్గించారని దుయ్యబట్టారు. ఈ ఘనకార్యాలు చేసినందుకు ఏపీ ప్రభుత్వాన్ని పొగాడాలా..? అంటూ ప్రశ్నించారు సోమిరెడ్డి.
Read Also: Talari Venkat Rao: నాపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదు..!
Also Read
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
రైతులు పండించిన పంటను గింజ గింజా కొనుగోలు చేసి మూడో రోజే తెలంగాణ ప్రభుత్వం రైతులకు నగదు జమ చేస్తోందని ప్రశ్నించారు సోమిరెడ్డి.. ఏపీలో ప్రభుత్వం రైతుల వద్ద 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదని ఆరోపించిన ఆయన.. కొన్న కొద్ది ధాన్యానికి కూడా డబ్బులివ్వడానికి ఆరేడు నెలలు పడుతోందన్నారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయమని ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ పోరాటం చేసిందని గుర్తుచేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోవడంతో చివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ప్రశంసలు కురిపించారు. ఇక, పెట్టుబడులన్నీ ఏకపక్షంగా తెలంగాణకు వెళ్లిపోతున్నాయని.. ఏపీలో పెట్టుబడి పెట్టేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి అర్థం తెలియని ఏపీ మంత్రులు.. ఏపీలో అభివృద్ధి విషయంలో అద్భుతాలు జరిగాయని జోకులేస్తున్నారని సెటైర్లు వేశారు. ఈ మూడేళ్లలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో, ఏం సాధించారో అర్థం కావడం లేదు.. రైతు భరోసా కేంద్రాలు.. రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.
తాజావార్తలు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్కు కొత్త మలుపు
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!