Somireddy Chadramohanreddy: వైసీపీపై సంచలన ఆరోపణలు..ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు సోమిరెడ్డి. టీడీపీ నేతలు.. కొందరు అధికారుల ఫోన్లను వైసీపీ ట్యాప్ చేస్తుందని మా అనుమానం. ప్రభుత్వ పరంగా కాకుండా.. వైసీపీ పార్టీ పరంగా ఓ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాపింగుకు పాల్పడుతున్నారని మేం నమ్ముతున్నాం. దీనిపై గతంలోనే మా అనుమానాలు వ్యక్తం చేశాం.
పెగాసెస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారన్నది ఓ పెద్ద బ్లండర్. దేశాల మధ్య రహాస్యాలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసే అవకాశమే లేదు. ఏపీ ప్రభుత్వం పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీనే సమాధానమిచ్చారు. మమతా బెనర్జీకి ఈ పెగాసెస్ స్పైవేర్ మీద అవగాహన లేకుండా ఉండొచ్చు. పీకేలు.. కేకేలు వంటి వారు మమతా బెనర్జీతో చెప్పించి ఉంటారని భావిస్తున్నాం.
Also Read
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
పెగాసెస్ స్పై వేర్ నాటి ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే వివేకా హత్య జరిగి ఉండేదే కాదు. కేంద్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఈ స్పై వేర్ ను కొనుగోలు చేసే అవకాశం లేదు. మోడీ ప్రభుత్వం మీద ఈ ఆరోపణలు ఉన్నాయి.. దీనిపై సుప్రీం కోర్టు ఎంక్వైరీ కమిషన్ వేసింది.విచారణలో వాస్తవాలు నిగ్గు తేలుతాయి. పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసే ఇల్లీగల్ యాక్టీవేట్సుని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు.
చంద్రబాబును.. లోకేష్ను పీకే తన వ్యూహాలతో తీవ్రంగా డామేజ్ చేసి ఎడ్వాంటేజ్ తీసుకున్నారు. కోడికత్తి, వివేకా హత్య విషయంలో టీడీపీపై ఆరోపణలు వంటివి పీకే వ్యూహాలే. పశ్చిమ బెంగాల్లో మమత కాలుకు కట్టు కట్టించి రాజకీయం చేసింది పీకేనే. మమతకు.. జగనుకు పీకేనే స్ట్రాటజీలు రూపొందిస్తున్నారు. పెగాసెస్ స్పై వేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని మమత బెనర్జీకి పీకేనే తప్పుడు సమాచారం అందించారని నమ్ముతున్నాం అన్నారు సోమిరెడ్డి.
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!