Road Accident in AP: ఏపీలో రోడ్డు టెర్రర్.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు టెర్రర్..
- అనంతపురం జిల్లాలో లారీ- ఇన్నోవా ఢీ కొట్టి నలుగురు మృతి..
- తిరుపతిలోని చిల్లకూరు సమీపంలోని జరిగిన యాక్సిడెంట్ లో ముగ్గురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదలు జరిగాయి. రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు ఏడుగురు చనిపోయారు. అయితే, అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట దగ్గర నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో.. సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగించారు. మృతులు అందరూ అనంతపురంలోని సిండికేట్నగర్ వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Manipur : మణిపూర్లో ఆర్మీ, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ .. భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలు స్వాధీనం
Also Read
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
మరోవైపు, తిరుపతి జిల్లా చిల్లకూరు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. నెల్లూరు నగరం వనంతోపు ప్రాంతానికి చెందిన భక్తులు తమిళనాడులోని అరుణాచలంకు వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. ముందు వెళ్తున్న కంటైనర్ ను వేగంగా వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. గాయపడిన వారిని గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!