Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను బుధవారం నాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 20న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 26న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్:
• ఈనెల 27న సాయంత్రం 5:45 నుండి 6:15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5:45 నుండి 6:15 గంటల వరకు ధ్వజారోహణం జరుగుతుంది. అదేరోజు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.
• సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగుతాయి.
• సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహ వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ జరుగుతాయి.
• సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ జరుగుతాయి.
• అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.
• అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం (స్వర్ణ రథం) జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ జరుగుతుంది.
• అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతాయి.
• అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం) జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీవారు ఊరేగింపు జరుగుతుంది.
• అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
కాగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు. గరుడ సేవకు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. బ్రహ్మోత్సవాలకు 7 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల భద్రతపై త్వరలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ధర్మారెడ్డితో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!