VandeBharat: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. టైమింగ్స్ ఇవే.. స్పీడ్ ఇంత తక్కువా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VandeBharat: ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈనెల 19న ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించబోతున్నారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖ మధ్య పరుగులు పెట్టనుంది. అయితే సాధారణంగా వందేభారత్ రైలు స్పీడ్ గంటకు 180 కి.మీ.తో వెళ్లాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు కేవలం 82.58 కి.మీ. స్పీడ్తోనే నడవనుంది. దీనికి కారణం రైల్వే ట్రాక్ అని అధికారులు చెప్తున్నారు. ఇంకా సరైన రీతిలో ట్రాక్ సిద్ధం కాకపోవడంతో వందేభారత్ తక్కువ వేగంతో ప్రయాణించనుంది. ఈ రైలు సికింద్రాబాద్, విశాఖ మధ్య కేవలం నాలుగు స్టేషన్లలోనే ఆగనుంది.
Read Also: Chiru Balayya: ఇంకా ఓపెన్ అవ్వని బుకింగ్స్.. ఆందోళనలో ఫ్యాన్స్
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
సికింద్రాబాద్లో మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరనున్న ఈ రైలు వరంగల్, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. రాత్రి 11:15 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖలో ఉదయం 5:45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. ప్రయాణ సమయం 8:30 గంటలుగా ఉంది. దురంతో రైలుతో పోలిస్తే గంటన్నర ప్రయాణ సమయం ఆదా కానుంది. ఇతర రైళ్లతో పోలిస్తే మూడు గంటలు వేగంగా వందేభారత్ సికింద్రాబాద్ నుంచి విశాఖ చేరుతుంది. ప్రస్తుతం దురంతో రైలు 10:10 గంటలు, గరీబ్ రథ్ 11:10 గంటలు, ఫలక్ నుమా 11:25 గంటలు, గోదావరి 12:05 గంటలు, ఈస్ట్ కోస్ట్ 12:40 గంటలు, జన్మభూమి 12:45 గంటల ప్రయాణ సమయం పడుతోంది.

తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!