Sariya water Fall: మృత్యుకుహరంగా సరియా వాటర్ పాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లూరిసీతారామరాజు జిల్లాలో జలపాతాలు పర్యాటకులకు ఒకవైపు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంటే అక్కడికి వెళ్ళినవారు మరణించడంతో విషాదం నెలకొంటోంది. సరియా జలపాతం టూరిస్టుల పాలిట మృత్యుకుహరంగా మారింది. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని సరియా జలపాతం ప్రమాదభరితంగా మారింది. మంగళవారం సరియా జలపాతానికి విహారానికి వచ్చిన విశాఖకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
వారి మృతదేహాలను అనంతగిరి పోలీసులు ఎట్టకేలకు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విశాఖ జగదాంబ సమీపంలోని ఎల్లమ్మతోట ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సరియా జలపాతం సందర్శించేందుకు వచ్చారు. వారిలోదుక్కసాయి 39 ప్రమాదవశాత్తూ జలపాతంలో జారిపడగా తనను రక్షించే ప్రయత్నంలో చైతన్య అనే 17 ఏళ్ళ యువకుడు కూడా అందరి కళ్లముందే గల్లంతయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన మిగిలిన ఇద్దరు స్నేహితులు సమీపంలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా రాత్రి సమయం కావడంతో ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదు.
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
బుధవారం వేకువ జామున అనంతగిరి పోలీసులు గజ ఈతగాళ్లుతో మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను ఒడ్డుకుచేర్చి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సరియా జలపాతంపై పోలీసులు స్థానికులు పలు హెచ్చరికలు సూచనలు చేస్తున్నప్పటికీ తరచూ పర్యాటకులు జలపాతంలో మృత్యువాతకు గురవుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినప్పటికీ పర్యాటకులు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు గురై వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నారు.
ఇప్పటికే సరియా జలపాతంలో పదులసంఖ్యలో పర్యాటకులు మృత్యువాతకు గురయ్యారు. ముఖ్యంగా యువకులే ఈప్రమాదంలో ఎక్కువగా చనిపోతున్నారు. కావున ఇప్పటికైనా తల్లిదండ్రులు వారి పిల్లలను సరియా జలపాతాన్ని సందర్శనకు పంపించే విషయంలో తగుజాగ్రత్తలు తీసుకుంటే జలపాతంలో ప్రమాదాలను నివారించవచ్చు. ఈప్రమాదంలో చనిపోయిన సాయికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖలో చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. చైతన్య ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
Dsp Died: శిల్పకళావేదికలో అపశృతి.. డిఎస్పీ క్యాడర్ అధికారి దుర్మరణం
తాజావార్తలు
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!