Sariya water Fall: మృత్యుకుహరంగా సరియా వాటర్ పాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లూరిసీతారామరాజు జిల్లాలో జలపాతాలు పర్యాటకులకు ఒకవైపు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంటే అక్కడికి వెళ్ళినవారు మరణించడంతో విషాదం నెలకొంటోంది. సరియా జలపాతం టూరిస్టుల పాలిట మృత్యుకుహరంగా మారింది. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని సరియా జలపాతం ప్రమాదభరితంగా మారింది. మంగళవారం సరియా జలపాతానికి విహారానికి వచ్చిన విశాఖకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
వారి మృతదేహాలను అనంతగిరి పోలీసులు ఎట్టకేలకు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విశాఖ జగదాంబ సమీపంలోని ఎల్లమ్మతోట ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సరియా జలపాతం సందర్శించేందుకు వచ్చారు. వారిలోదుక్కసాయి 39 ప్రమాదవశాత్తూ జలపాతంలో జారిపడగా తనను రక్షించే ప్రయత్నంలో చైతన్య అనే 17 ఏళ్ళ యువకుడు కూడా అందరి కళ్లముందే గల్లంతయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన మిగిలిన ఇద్దరు స్నేహితులు సమీపంలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా రాత్రి సమయం కావడంతో ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదు.
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
బుధవారం వేకువ జామున అనంతగిరి పోలీసులు గజ ఈతగాళ్లుతో మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను ఒడ్డుకుచేర్చి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సరియా జలపాతంపై పోలీసులు స్థానికులు పలు హెచ్చరికలు సూచనలు చేస్తున్నప్పటికీ తరచూ పర్యాటకులు జలపాతంలో మృత్యువాతకు గురవుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినప్పటికీ పర్యాటకులు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు గురై వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నారు.
ఇప్పటికే సరియా జలపాతంలో పదులసంఖ్యలో పర్యాటకులు మృత్యువాతకు గురయ్యారు. ముఖ్యంగా యువకులే ఈప్రమాదంలో ఎక్కువగా చనిపోతున్నారు. కావున ఇప్పటికైనా తల్లిదండ్రులు వారి పిల్లలను సరియా జలపాతాన్ని సందర్శనకు పంపించే విషయంలో తగుజాగ్రత్తలు తీసుకుంటే జలపాతంలో ప్రమాదాలను నివారించవచ్చు. ఈప్రమాదంలో చనిపోయిన సాయికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖలో చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. చైతన్య ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
Dsp Died: శిల్పకళావేదికలో అపశృతి.. డిఎస్పీ క్యాడర్ అధికారి దుర్మరణం
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!