Sajjala Ramakrishnareddy: వైసీపీ ప్లీనరీ నభూతో నభవిష్యతి
రెండురోజుల పాటు గుంటూరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ విజయవంతం అయిందని వైసీపీనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ నభూతో న భవిష్యత్తు లా జరిగింది. పార్టీ పండుగ కోసం అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు ఉప్పెనలాగా వచ్చారు. ప్లీనరీతో టీడీపీ, దత్త పుత్రుడు, టీడీపీ మీడియా చేస్తూ వచ్చిన అబద్దాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఈ వాస్తవం చంద్రబాబుకు మింగుడు పడడంలేదని మండిపడ్డారు.
గేమ్ మార్చి స్పీడ్ పెంచి ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోనే ఉన్నట్లు భ్రమలు తన చుట్టూ పెట్టుకుంటాడు చంద్రబాబు. కంకర, సిమెంట్, సిమెంట్ వంటివి లేకుండానే చంద్రబాబు హయాంలో నిర్మాణాలు చేసే వాళ్ళేమో. చేతిలో ఏమీ లేకపోయినా మాయాబజార్ సృష్టించగలిగిన వ్యక్తి చంద్రబాబు. మైనింగ్ శాఖ సమర్ధవంతంగా వ్యవహరించటం వల్లే ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, అవార్డులు వస్తున్నాయన్నారు సజ్జల.
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో భవనాలు లేకపోయినా ఎడారి ప్రాంతంగా మార్చి అమెరికాలా భ్రమలు కల్పించారని సజ్జల మండిపడ్డారు. మట్టి, సిమెంట్, ఇసుక ఉపయోగించకుండా నిర్మాణాలు చేపట్టారేమో? అన్నట్లుగా చంద్రబాబు స్టేట్మెంట్ చూస్తే అనిపిస్తోంది. అనాదిగా ఏ ప్రభుత్వం ఉన్నా..నిర్మాణాలు జరగాలంటే మైనింగ్ జరగాల్సిందే. ఇప్పుడే చంద్రబాబు దీని గురించి ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఏవేవో జరిగిపోతున్నాయని ఒక ఉద్యమంలా ఫోటోలు చూసించి ఘోరాలు జరిగిపోతున్నాయని ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు? అని సజ్జల విమర్శించారు.
ఒక పక్క రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ మట్టి తోలకుండా, ఇసుక తోలకుండా నిర్మాణాలు ఎలా జరుగుతాయి. వీటన్నింటిని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. చట్ట ప్రకారం కాకుండా విరుద్ధంగా జరుగుతుంటే అడ్డగించవచ్చు. అది కూడా ప్రభుత్వం స్పందించకపోతే మీరు మాట్లాడవచ్చు. మా ప్రభుత్వానికి అవార్డులువస్తున్నాయి. రెవెన్యూ పెరిగింది. ప్రజల సొమ్ము వృథా కాకూడదని చూస్తున్నాం. ప్రభుత్వంలో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. వారం పది రోజుల్లో చంద్రబాబు చెబుతున్న అబద్ధాలన్నీ నిజాలు కావన్నారు సజ్జల,
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!