Sajjala Ramakrishna Reddy: కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయం చేయదలచుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయాయి.. అన్యాయంగా.. అధ్వానంగా పరిస్థితి ఉందంటూ ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్నే రేపుతున్నాయి.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కేటీఆర్ అయినా.. ఎవరైనా.. మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలని.. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు, సుమారు 50- 60 వేల కోట్ల ఆస్తులు విభజన జరగాల్సి ఉందన్నారు. ఏపీకి కేపిటల్ లేకుండానే విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత 5 ఏళ్లపాటు అభివృద్ది జరగలేదని.. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో వాళ్లకు, మనకు అందరికీ తెలుసన్నారు సజ్జల.
Read Also: YS Jagan: రమ్య కేసులో తీర్పుపై స్పందించిన సీఎం..
Also Read
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
అయితే, అధిక వర్షాల వల్లే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కానీ, కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేయదలచుకోలేదన్నారు. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవని విమర్శించిన ఆయన.. మొన్నటి వరకు తెలంగాణ లోనూ విద్యుత్ కోతలున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.. ఏపీలో సీఎం జగన్ పాలనలో తన మార్కును చూపిస్తున్నారని తెలిపారు. మరోవైపు, రమ్య హత్య కేసులో కోర్టు తీర్పుపై స్పందించిన సజ్జల.. దిశ చట్టం తెచ్చిన స్ఫూర్తితో యువతిని చంపిన నిందితుడికి ఉరిశిక్ష పడిందన్నారు. దిశ చట్టంపై చేస్తున్నవన్నీ రాజకీయ విమర్శలేనని మండిపడ్డ ఆయన.. దిశ చట్టంపై విమర్శలు చేస్తోన్న వారికి తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!