Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు చేసిన స్కాంలు ఆధారాలతో సహా బయటకు వస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy On Chandrababu Karakatta House Issue: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టపై చంద్రబాబు అద్దెకు ఉన్న లింగమనేని నివాసం జప్తపై ఏసీబీ కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇంటిని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ని విచారించిన ఏసీబీ కోర్టు.. ఇంటి జప్తునకు అనుమతించింది. అలాగే.. లింగమనెని రమేష్తో పాటు మిగతా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో.. మాజీ మంత్రి నారాయణకు చెందిన ఆస్తుల పాక్షిక జప్తునకు కూడా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. జప్తు వ్యవహరంతో తమకేం సంబంధం లేదని టీడీపీ పేర్కొంది. తాను నివాసం ఉంటున్న ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని టీడీపీ వెల్లడించింది.
Bandi Sanjay: గోమాతను వధిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?..ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తారా?
Also Read
- YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
- Mega DSC 2025: మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
ఈ నేపథ్యంలోనే.. లింగమనేని ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తే, ఆ ఆధారాలను బయటపెట్టాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, లింగమనేనికి మధ్య ఏం ఒప్పందం జరిగిందో మీడియాకు వెల్లడించాలని కోరారు. ఒక పరిశోధన సంస్థ.. ప్రాధమిక ఆధారాలతోనే చంద్రబాబు నివాసాన్ని జప్తు చేసిందని ఆయన వెల్లడించారు. ప్రాధమిక ఆధారాలను బట్టి సంతృప్తి చెందటం వల్లే, జప్తుకు కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. పెద్ద నోరు పెట్టుకుని మాట్లాడితే.. అబద్దాలు నిజాలు అయిపోతాయన్నట్లు టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కుంభకోణమే జరుగలేదు అనుకుంటే.. టీడీపీ ఎందుకు భయపడుతోంది? అని నిలదీశారు. చంద్రబాబు తన హయాంలో లింగమనేని ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చినట్లు చెప్పటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
Krithi Shetty: చిట్టి నడుముతో, ఎల్లో శారీలో గుండెలు కోస్తున్న కృతి శెట్టి
రాజకీయ కక్ష సాధింపు చేయాలనుకుంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరిని కేసుల్లో ఇరికించి, లోపల వేసి ఉండే వారని సజ్జల హెచ్చరించారు. కానీ, తాము అలా చేయలేదన్నారు. తగిన ఆధారాల సేకరించిన తర్వాతే విచారణ జరుగుతోంద్నారు. ఈ స్కాం చంద్రబాబు తలలో పుట్టిన ఆలోచనల నుంచి వచ్చిందని ఆరోపించారు. ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్పు చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని.. టీడీపీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఈ మొత్తం కుంభకోణంలో లింగమనేని ఇల్లు టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ అని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో అప్పటి మంత్రి నారాయణ లింక్గా వ్యవహరించాన్నారు. అధికార దుర్వినియోగానికి ఈ కేసు నిఖార్సైన ఉదాహరణ అని చెప్పిన సజ్జల.. చంద్రబాబు చేసిన స్కాంలు ఆధారాలతో సహా బయటకు వస్తాయ్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: మేము కాదు, వాళ్లే అసలు హీరోలు.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
Allu Arjun Fans Association: కష్టాల్లో ఫ్యాన్ కుటుంబానికి అండగా AAFA.. రూ.1.5 లక్షల సహాయం!
-
Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!