Sajjala Ramakrishna Reddy: అభ్యర్థుల మార్పు.. నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాం.. ఇమడలేని వారు వెళ్లిపోతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ సీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన సమీక్షలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇక సీఎం జగన్ సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తరచు జరిగే సమీక్షలే చేశామని, తమ ప్రభుత్వం చేసిన, చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించామన్నారు.
Also Read: JC Prabhakar Reddy: పోలీసులకి ఖాకీ డ్రెస్సులు ఎందుకు..? వాళ్లను చూస్తే సిగ్గేస్తుంది..!
Also Read
అలాగే జనవరిలో జరిగే అంబేద్కర్ ఆవిష్కరణ, మూడు వేల పెన్షన్ల పై చర్చించామని చెప్పారు. అదేవిధంగా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇచ్చిన హమీల్లో అమలు చేసిన పూర్తి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే వంటి అంశాలపై కూడా చర్చించామన్నారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్ల నేతృత్వంలో అభ్యర్థుల మార్పు వంటి అంశాలను కూడా చర్చించామన్నారు. పార్టీలో రకరకాల వ్యక్తులు ఉంటారని, వైసీపీ చాలా బలోపేతంగా ఉందన్నారు. నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తామని, అయినా ఇమడ లేకపోయిన వాళ్ళు వెళ్ళిపోతారన్నారు.
Also Reddy: Bigg Boss Telugu : ఇకపై అవి రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు కూడా మా పార్టీలోకి ఇంకా బలమైన వాళ్ళు వస్తారు అనుకున్నామన్నారు. అయితే ఏ పార్టీలోనైనా అసంతృప్తులు సహజమన్న ఆయన తమ పార్టీ మంచి ఫామ్లో ఉందన్నారు. అందుకే పోటీ చేయటానికి నాయకులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని తెలిపారు. అయితే, అసంతృప్తుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అని అందరు అనుకుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్నామని, అంబేద్కర్ ఆశయ సాధనలో వైసీపీ ఎప్పుడూ ముందు వరుసలో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..