Sailajanath: అది అరాచకపాలన కాక మరేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో జగన్ పాలన ఆటవిక పాలనగా మారుతుంది. కోర్టులో కేసులో ఉన్న పత్రాలు దొంగిలించడం అరాచక పాలనకు పరాకాష్ఠ. పోలీసు కట్టుకధలు మరింత విస్మయానికి గురి చేస్తున్నాయన్నారు ఏపీసీసీ చీఫ్ సాకె శైలజనాథ్. ఎక్కడో బీహార్లో విన్న కధలు.. ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం.
దళిత బిడ్డలను చంపినా, కొట్టినా పట్టించుకోలేదు. నిన్న ఎస్పీ అంత అర్జంటుగా మీడియా సమావేశం పెట్టడం ఎందుకు..?వాళ్లు చెప్పిన అంశాలు నమ్మే విధంగా ఉన్నాయా..?ఎవరిచ్చారో ఇటువంటి కొత్త ఐడియాలు.ఎవరైనా తప్పులను ప్రశ్నిస్తే కొట్టేందుకు వెనుకాడటం లేదన్నారు. దళితులపై దాడి జరిగితే ఒక్క చర్య ఉండదు, కేసు నమోదు చేయరు. హోం మంత్రులుగా ఎస్సీలను చేసినా.. నామ్ కే వాస్తే మంత్రులే.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
జగన్ చెప్పు చేతుల్లోనే అన్ని అధికారాలు. చేతులు కట్టుకోవడం, దండాలు పెట్టడమే మంత్రుల పని. జగన్ నోటి నుంచి వచ్చే మాట ఒకటి.. ఆచరణలో పెట్టేది మరొకటి అని మండిపడ్డారు శైలజానాథ్. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. సలహాదారులకు లక్షల జీతాలు ఇచ్చి మేపుతున్నారు. వారి వల్ల రాష్ట్రానికి, సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదు.
ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, అప్పగించడమే జగన్ పని. అభివృద్ధి లేదు.. అవసరమైతే రోడ్లు కూడా అమ్మేస్తారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఏపీలో రూ. 1.50 లక్షల కోట్ల బడ్జెట్ ఉండేది. విభజన తరువాత రెండు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. అంటే పేద రాష్ట్రం కాదు.. ఏపీ ధనిక రాష్ట్రం. సీఎం, మంత్రులు అసత్యాలను ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నారు. జగన్ ను ఆరాధిస్తే స్థలాలు వస్తాయని జర్నలిస్టులకే ఒక మంత్రి సూచన చేస్తారు. జగన్ తన ప్రయోజనాలను కాపాడే వారినే మంత్రులుగా పెట్టుకున్నారు.
ధరలు పెరిగితే ఆ భారం పేద, మధ్య తరగతి ప్రజల పైనే ఉంటుంది. ఇటువంటి అంశాల పై జగన్ కనీసం స్పందించరు. విద్యుత్ ధరలు పెంచి కొత్త భారాలు మోపారు. రాజ్యాంగానికి విరుద్దంగా జగన్ పాలన సాగుతుంది. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని కాంగ్రెస్ తరపున 20వ తేదీ నిర్వహిస్తామని శైలజానాథ్ చెప్పారు. జగన్ కూడా ఆలోచన మార్చుకుని ఒక్కసారి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
Read Also: Kuna Ravikumar: నెల్లూరు ఎస్పీవి కట్టుకథలే
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!