Rk Roja: పవన్ కళ్యాణ్ అరిచి అరిచి గుండెపగిలి చచ్చిపోతాడేమో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rk Roja: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టేస్తూ.. తన అభిమాన సంఘాలనే కాకుండా ప్రజలను కూడా తనదైన మాటతీరుతో ఆకట్టుకోవడమే కాకుండా సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక నిన్నటికి నిన్న గాజువాకలో జరిగిన సభలో జగన్ పై పవన్ మరోసారి దుమ్మెత్తిపోశారు. ” ఆస్తులు అమ్ముకునేందుకా ప్రజలు మిమ్మల్ని సీఎంగా ఎన్నుకున్నది. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తాను.. “అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా భూమి పేలిపోవాలి.. అందులో రుషికొండ మునిగిపోవాలి.. అందులో జగన్ సమాధి కావాలి అని ఆవేశంగా మాట్లాడారు. ఇక ఈ మాటలకు మినిస్టర్ రోజా కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై రోజా తనదైన రీతిలో చెలరేగారు. పవన్ కళ్యాణ్ కు పిచ్చి పట్టిందని ఎర్రగడ్డ లో చేర్పించాలని తెలిపారు. జగన్ ను చూసి పవన్ కుళ్ళుకుంటున్నాడని.. అందుకే తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.
Upendra: వారి గురించి నీచంగా మాట్లాడిన ఉపేంద్రపై కేసు.. స్టే ఇచ్చిన కోర్టు
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
” పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే.. జగన్ గారి పై ఆయన కడుపుమంట, ఆయన జెలసీ ఎంత పెరిగిపోతుందో స్పష్టంగా అర్ధమవుతుంది. తనకన్నా చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు.. రోజురోజుకు ప్రజల్లో అభిమానం పెరిగిపోతుంది. దేశంలో ఆయన క్రేజ్ ఎంత పెరుగుతుందో చూసి సహించలేని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే.. భూమి పేలిపోవాలి.. అందులో రుషికొండ మునిగిపోవాలి.. అందులో జగన్ సమాధి కావాలి అని మాట్లాడు అంటే.. ఈయన కడుపుమంటతోనే గుండెలు పగిలేలా అరిచి అరిచి చచ్చిపోతాడేమో.. అని భయమేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆరోగ్యశ్రీ కింద ఈ పవన్ కళ్యాణ్ ను కడుపుమంటల కళ్యాణ్ అనే ప్రోసిజర్ కింద ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కడుపుమంటను చల్లార్చామని కోరతాం.. అప్పటికి చల్లారాకపోతే హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో జాయిన్ చేయాలనీ కోరుతున్నాం” అంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ అరిచి అరిచి గుండె పగిలి చచ్చిపోతాడేమోనని భయమేస్తోంది! – రోజా#Roja #PawanKalyan #VarahiVijayaYatra #VarahiVijayaYatraPhase3 #Janasena #JanaSenaPorataYatra #RojaSelvamani #YSRCP #AndhraPradesh #YSRCP #NTVTelugu pic.twitter.com/RPmoLaO5XE
— NTV Telugu (@NtvTeluguLive) August 14, 2023
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!