వైద్య ఆరోగ్య శాఖ, నాడు–నేడు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటి వెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలసుకోవడంతో పాటు పలు ఆదేశాలు ఇచ్చారు.వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం, ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయినట్టు అధికారులు తెలిపారు.
పీహెచ్సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు సీఎంకు వివరించారు. డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు సీఎం జగన్కు తెలిపారు.వీటి నిర్మాణా లు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. సీహెచ్సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పను లు చురుగ్గా సాగుతున్నాయని, అత్యవసర పనులను ఇప్పటికే పూర్తి చేశామన్న అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన పనులుకూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం అధికారులను ఆదేశించారు.
16 కొత్త మెడికల్కాలేజీల్లో పనుల ప్రగతిపై సీఎం సమీక్ష
ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలై ఉన్నాయని వీటిని త్వరగా పరిష్కరించే విధంగా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపైనా సీఎం సమీక్షించారు.
గణనీయంగా పెరిగిన వైయస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు
2019 జూన్కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న వైద్య ప్రక్రియలు 1059, 2019 జూన్ తర్వాత 2446 వైద్య ప్రక్రియలకు పెరిగాయని అధికారులు తెలిపారు. 2019 జూన్కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న కవరేజీ ఆస్పత్రులు 919, తర్వాత 1,717 ఆస్పత్రులకు పెంపు తోపాటు కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ది చేకూరిం దన్నారు. 2019 జూన్కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు లబ్ధి 1570 మందికి జరిగితే.. ప్రస్తుతం 3,300 మందికి లబ్ది చేకూరు తుందన్నారు. బధిర, మూగ వారికి పూర్తి ఖర్చులతో శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ. 439.4 కోట్లు చెల్లించి నట్టు అధికారులు తెలిపారు.క్యాన్సర్ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచి తంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం అధి కారులను ఆదేశించారు.
వైయస్సార్ కంటి వెలుగుపైనా సీఎం సమీక్ష
ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్న సీఎం.కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలన్న సీఎం. దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం అధికారులను కోరారు. ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మంది కంటి అద్దాలు ఇచ్చామని తెలిపిన అధికారులు.60 ఏళ్ల పైబడ్డ వారికి 13,58,173 మందికి పరీక్షలు చేశామన్న అధికారులు, ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు, మరో 1,00,223 మందికి శస్త్రచికిత్సలు చేయించామన్న అధికారులు తెలిపారు.
మరో 26,437 మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయించాలన్న అధికారులు సీఎంకు వివరించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లిని క్స్కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగిం చాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో పాటు హెల్త్ హ బ్స్ పై సీఎం మాట్లాడారు. జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్. మొత్తం 16 చోట్ల ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్, ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తించారు.
కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సీఎంకు వివరాలందించిన అధికారులు
మొత్తం పాజిటివ్ కేసులు 3,366 పాజిటివిటీ రేటు 0.7 శాతంగా ఉందన్నారు. పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్న వైద్య ఆరోగ్యశాఖ అధి కారులు తెలిపారు. 2 కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లా 1 గా ఉందన్నారు.అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్ కాన్సం ట్రేట ర్స్ 23,457 అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ–టైప్ సిలిండర్లు 27,311 ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు మొత్తం 140 ఉన్నా యని తెలిపారు.15 డిసెంబరు నాటికి పీఏస్ఏ ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేస్తామన్న అధికారులు
వ్యాక్సినేషన్
సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,17,71,458
రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 2,17,88,482
మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 3,35,59,940
మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 గా ఉందని అధికారులు పేర్కొన్నారు.