Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Rescue Teams Headache With Victims

Rescue Teams Headache: ఉదయం వచ్చి రాత్రికి నాటుపడవల్లో…

Published Date :July 16, 2022 , 4:10 pm
By NTV WebDesk
Rescue Teams Headache: ఉదయం వచ్చి రాత్రికి నాటుపడవల్లో…
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఏపీలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రెస్క్యూ బృందాలకు మాత్రం తలనొప్పులు తప్పడం లేదు. ఏలూరు జిల్లాలో భారీవర్షాలు, వరదలతో ఇళ్ళు, పొలాలు ఏకం అయిపోయాయి. గోదావరిలా మారిన రహదారులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మూడు వంతులు నీట మునిగిన కరెంట్ స్తంభాలతో కరెంట్ సరఫరా నిలిపేశారు. వందలాది మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఫైర్ సేఫ్టీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ముందస్తుగా ఇళ్లు వదిలి రావటానికి మొరాయిస్తున్న పలువురు గ్రామస్తులను బుజ్జగిస్తున్నాయి రెస్య్యూ టీంలు. ఒప్పించి ఉదయం తీసుకుని వస్తే సాయంత్రం నాటు పడవల్లో తిరిగి ఇళ్ళకు వెళ్ళి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. వీరిని ఎలాగైనా పునరావాస కేంద్రాలకు రప్పించడం తలకు మించిన భారంగా మారుతోంది.

మరోవైపు కుక్కునూరుకు అదనపు బలగాలు వస్తున్నాయి. భద్రాచలం దగ్గర ఇన్ ఫ్లో తగ్గినా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద తగ్గటానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం వుందంటున్నారు అధికారులు. దీంతో రంగంలోకి వచ్చిన అదనపు రెస్క్యూ బృందాలు అటువైపు వెళుతున్నాయి. కుక్కునూరుకు 40 మంది అదనపు రెస్క్యూ టీం చేరుకుంది. అక్కడ పరిస్థితిని వారు సమీక్షిస్తున్నారు. వర్షాలు తగ్గినా వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నారు అధికారులు.

Also Read

  • Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
  • Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
  • RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్‌
  • Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
Add as a preferred
source on google

Aam Aadmi Party: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించిన ఆమ్‌ఆద్మీ పార్టీ

కోనసీమ లంక గ్రామాల్లో వర్ణనాతీతంగా మారింది వృద్దుల (Elders Problems) పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న ముసలి వాళ్లు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరూ లేని వారి పరిస్థితులు మరింత కష్టంగా మారాయి. ఆదుకునే వారి కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఎవరు అయినా దయతలచి పెడితే తినడం, లేదంటే పస్తులు తప్పడంలేదంటున్నారు. ఎప్పుడో తమ చిన్నతనంలో ఈస్థాయి వరద చూసామని చెబుతున్నారు ముసలిముతక. ఇంత భారీ స్థాయిలో గోదావరికి వరద రావడం అరుదని వారంటున్నారు. ఇదిలా వుంటే.. ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అక్కడ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 24.57 లక్షల క్యూసెక్కులుగా వుంది.

విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు. 28 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం వుందని చెబుతున్నారు. సంబంధిత అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ. అంబేద్కర్ కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం వుందని తెలుస్తోంది. అల్లూరిసీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి లో 4 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం వుంది. ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం వుందని చెబుతున్నారు.

అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు అందుతున్నాయి. వరద ఎక్కువ అయ్యే అవకాశం వుండడంతో అదనపు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వున్నాయి. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాలు వరద ప్రభావితం అయింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Kajol Devgan: కాజోల్ బోల్డ్ కామెంట్స్.. ఫిగర్ లేనివాళ్లు కూడా హీరోయిన్లు అవుతున్నారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • ap govt
  • cm jaganmohanreddy
  • flood victims
  • godavari floos

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions