Ram Gopal Varma: చంద్రబాబు నరహంతకుడు.. వర్మ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma Sensational Comments On Chandrababu Naidu: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లోకెక్కే రాంగోపాల్ వర్మ.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు ఓ నరహంతకుడు అనే పేరుతో యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన వర్మ.. అందులో ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించాడు. పెద్ద పెద్ద ప్రాంతాల్లో సభలు పెడితే అక్కడికి జనాలు రారని, దాంతో తన పాపులారిటీ తగ్గిపోయిందని అందరికీ తెలిసిపోతుందన్న భయంతోనే.. చంద్రబాబు చిన్న చిన్న ప్రాంతాల్లో సభలు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. చిన్న గీత, పెద్ద గీత అనే కాంటెక్ట్స్లో.. చిన్న ప్రాంతాల్లో సభలు పెడితే, అది పెద్దదిగా కనిపిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారన్నాడు.
Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్.. అసలు నిధి స్నేహితురాలే కాదట!
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
ఆ చిన్న ప్రాంతాల్లో నిర్వహించే సభలకు కూడా జనాలు రారన్న భయంతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు, ప్రజలకు కానుకల ఎర చూపించి సభకు తీసుకొచ్చారని వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఫోటోల కోసం చంద్రబాబు కొంతమందికి బిస్కెట్లు వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నాడు. తాను మూడుసార్లు సీఎం అయ్యానని చెప్పుకునే చంద్రబాబుకి, ప్రజలంటే ఏంటో తెలీదా? అని ప్రశ్నించాడు. ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాల్లో సభలు నిర్వహిస్తే, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న విషయం తెలీదా? అని నిలదీశాడు. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు గడ్డితో సమానమని, కేవలం స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తారే తప్ప, అంతకుమించి ప్రజల సమస్యలు ఆయనకు అవసరం లేదని తెలిప్పాడు. కానుకలు ఇచ్చే సంస్కృతిని చంద్రబాబే ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలుసని.. కానుకలకి, లంచానికి తేడా ఏంటని ప్రశ్నించాడు.
Lady Killer: భర్త ఉద్యోగం కోసం.. ఆ దారుణానికి పాల్పడ్డ మహిళ
ఎంతమంది చనిపోతే, తనకు అంత పాపులారిటీ ఉందని చంద్రబాబు ఫీల్ అవుతారని వర్మ ఆరోపించాడు. తన పాపులారిటీకి జనాల చావుల్ని కొలమానంగా తీసుకోవడం.. నిజంగా హీనమైన చర్య అని అభివర్ణించాడు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు.. చిన్న ప్రాంతాల్లో సభలు పెడితే, అలాంటి పరిణామాలు ఎదురవుతాయని తనకు తెలియదని చెప్పడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ప్రజల ప్రాణాల కన్నా తన పాపులారిటీనే చంద్రబాబుకి ముఖ్యమని ఆర్జీవీ నొక్కి వక్కాణించాడు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల సెక్యూరిటీనే చూడకపోవడమేంటని ప్రశ్నించిన వర్మ.. హిట్లర్, ముస్సోలిని తర్వాత ప్రజల ప్రాణాలతో ఆడుకునే వ్యక్తి చంద్రబాబేనంటూ కుండబద్దలు కొట్టాడు.
Veera Simha Reddy: ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అనుమతి నిరాకరణ.. అడ్డా మార్చిన బాలయ్య
https://www.youtube.com/watch?v=LkMJ1DroGgo&t=1s&ab_channel=RGV
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!