Maoists Violence: ప్రైవేట్ బస్సుకి నిప్పు.. మావోయిస్టుల దుశ్చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ప్రైవేట్ బస్ ను తగులబెట్టారు మావోయిస్టులు. ప్రయాణీకులను దించివేసి బస్సుకు నిప్పు పెట్టారు మావోయిస్టులు. ఒడిశా నుండి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని చింతూరులో కాల్చివేశారు. ఇవాళ దండకారణ్య బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు అందులో భాగంగానే ఈ దుశ్చర్యకు దిగారని పోలీసులు భావిస్తున్నారు.
ఆంధ్రా సరిహద్దు ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా కుంట వద్ద జాతీయరహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసు అధికారులు. ఈమధ్యకాలంలో రోడ్ల నిర్మాణానికి ఉపయోగించే పరికరాలను కూడా మావోయిస్టులు తగలబెడుతున్న సంగతి తెలిసిందే. బస్సు తగులబెట్టడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను ప్రత్యేక వాహనాల్లో గమ్య స్థలాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేశారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 25 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు.మావోయిస్టుల చర్యలను ప్రత్యేక్షంగా చూసిన వీరంతా భయాందోళనలకు గురయ్యారు.తాజా ఘటనతో చింతూరు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
Read Also IPL 2022: ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. టోర్నీలో వరుసగా 8వ ఓటమి
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!