Pregnants Problems in Agency: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. నిండు గర్భిణికి నరకయాతన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల జీవితాల్లో మాత్రం వెలుగులు ప్రసరించడం లేదు. గిరిజనులు నడవడానికి కూడా రోడ్డు సౌకర్యం అందడం లేదు. దీంతో గిరిజనులు, ముఖ్యంగా గర్భిణీలు నానా కష్టాలు పడుతున్నారు. ఒక్కోసారి ప్రసవం కోసం కిలోమీటర్లు నడిచి కడుపులో బిడ్డను కోల్పోయి కడుపుకోతను అనుభవిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భిణీల డోలి మోతలు తప్పడం లేదు. తాజాగా అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ రాచకీలం కొండపై గ్రామంలో సూకూరు లక్ష్మి(20) అనే గర్భిణీకి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే 108 కి ఫోన్ చేశారు.
Read Also: KS Eshwarappa: అల్లా ఏమైనా చెవిటివాడా.. ‘అజాన్’పై బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో గర్భిణీని రోడ్డు మార్గం తెమ్మన్నారు. దీంతో కొండపైనుంచి రాచకిలం నుంచి గుమ్మంతి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలు, ఎత్తైన కొండ మార్గం నుంచి మైదాన ప్రాంతం గుమ్మంతి వరకు ఆమెను డోలిపై మోసుకుని అంబులెన్సు వద్దకు వచ్చారు. అంబులెన్సులో ఆమెను పినకోట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ వైద్యులు లేకపోవటం వల్ల ఆమెను కే.కోటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ వైద్యుల సూచన మేరకు ఆమెను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. గత ఏడాది సెప్టెంబర్ లో డోలిపై ఇద్దరు రోగులను తరలించడంతో వారు చికిత్స పొందుతూ మృతి చెందారు.
తమ గ్రామాలకు రోడ్డు లేకపోవటం వల్ల ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా.. డోలి మోతలే గత్యంతరం అని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తమ అనుమతులు లేనిదే శ్రమదానం చేసి రహదారి నిర్మిస్తే.. కేసులు పెడతామని బెదిరించినట్లు గ్రామస్థులు వాపోతున్నారు. అయితే అప్పటినుంచి శ్రమదానంతో రహదారి పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం నిర్మించదని, తాము రోడ్డు వేసుకుంటామంటే అటవీ అధికారులు అడ్డుతగలడం దారుణం అంటున్నారు గ్రామస్తులు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Gold Smuggling : బంగారం బీరు బాటిళ్లలో పెట్టావు బాగానే ఉంది.. కానీ
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!