Pregnants Problems in Agency: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. నిండు గర్భిణికి నరకయాతన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల జీవితాల్లో మాత్రం వెలుగులు ప్రసరించడం లేదు. గిరిజనులు నడవడానికి కూడా రోడ్డు సౌకర్యం అందడం లేదు. దీంతో గిరిజనులు, ముఖ్యంగా గర్భిణీలు నానా కష్టాలు పడుతున్నారు. ఒక్కోసారి ప్రసవం కోసం కిలోమీటర్లు నడిచి కడుపులో బిడ్డను కోల్పోయి కడుపుకోతను అనుభవిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భిణీల డోలి మోతలు తప్పడం లేదు. తాజాగా అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ రాచకీలం కొండపై గ్రామంలో సూకూరు లక్ష్మి(20) అనే గర్భిణీకి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే 108 కి ఫోన్ చేశారు.
Read Also: KS Eshwarappa: అల్లా ఏమైనా చెవిటివాడా.. ‘అజాన్’పై బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో గర్భిణీని రోడ్డు మార్గం తెమ్మన్నారు. దీంతో కొండపైనుంచి రాచకిలం నుంచి గుమ్మంతి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలు, ఎత్తైన కొండ మార్గం నుంచి మైదాన ప్రాంతం గుమ్మంతి వరకు ఆమెను డోలిపై మోసుకుని అంబులెన్సు వద్దకు వచ్చారు. అంబులెన్సులో ఆమెను పినకోట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ వైద్యులు లేకపోవటం వల్ల ఆమెను కే.కోటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ వైద్యుల సూచన మేరకు ఆమెను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. గత ఏడాది సెప్టెంబర్ లో డోలిపై ఇద్దరు రోగులను తరలించడంతో వారు చికిత్స పొందుతూ మృతి చెందారు.
తమ గ్రామాలకు రోడ్డు లేకపోవటం వల్ల ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా.. డోలి మోతలే గత్యంతరం అని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తమ అనుమతులు లేనిదే శ్రమదానం చేసి రహదారి నిర్మిస్తే.. కేసులు పెడతామని బెదిరించినట్లు గ్రామస్థులు వాపోతున్నారు. అయితే అప్పటినుంచి శ్రమదానంతో రహదారి పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం నిర్మించదని, తాము రోడ్డు వేసుకుంటామంటే అటవీ అధికారులు అడ్డుతగలడం దారుణం అంటున్నారు గ్రామస్తులు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Gold Smuggling : బంగారం బీరు బాటిళ్లలో పెట్టావు బాగానే ఉంది.. కానీ
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!