KS Eshwarappa: అల్లా ఏమైనా చెవిటివాడా.. ‘అజాన్’పై బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader KS Eshwarappa Controversial Comments On Azaan: సీనియర్ బీజేపీ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ‘అజాన్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అల్లా ఏమైనా చెవిటివాడా.. ఆయనను పిలవడానికి లౌడ్స్పీకర్లు ఉపయోగించాల్సిన అవసరం ఉందా?’ అని ప్రశ్నించారు. తాను బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో.. సమీపంలో ఉండే మసీదు నుండి ‘అజాన్’ వచ్చిందని, తానె ఎక్కడికి వెళ్లినా ఈ అజాన్ తలనొప్పిగా మారిందంటూ వ్యాఖ్యానించారు. ఈ అజాన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉందని.. ఈరోజు కాకపోతే కచ్ఛితంగా అజాన్ని నిలిపివేయాలంటూ ఏదో ఒక రోజు పిలుపు తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు.
Amjad Basha: ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది జగనే
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
హిందూ ఆలయాలలో అమ్మాయిలు, మహిళలు ప్రార్థనలతో పాటు భజనలు చేస్తారని.. తామూ మతపరమైన వాళ్లమేనని, కానీ లౌడ్ స్పీకర్లను వినియోగించమని ఈశ్వరప్ప అన్నారు. మీరు లౌడ్ స్పీకర్లను వినియోగించి ప్రార్థనలకు పిలవవలసి వస్తే.. అప్పుడు దానర్థం అల్లా చెవిడివాడేనని చెప్పారు. ఈ విధంగా ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా.. ఉప ముఖ్యమంత్రిగానూ పని చేసిన ఈశ్వరప్పకు వివాదాలు కొత్తేమీ కాదు. 18వ శతాబ్దపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ను ‘ముస్లిం గూండా’గా పేర్కొన్నప్పుడు కూడా వివాదం చెలరేగింది. గతేడాది ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసు వ్యవహారంలో.. ఈ సీనియర్ నేత తన మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి పంపించిన చివరి మెసేజ్లలో.. తన సూసైడ్కి ఈశ్వరప్పే ప్రధాన కారణమని ఆ కాంట్రాక్టర్ పేర్కొనడంతో, ఆ నేతపై పోలీసులు కేసు పెట్టారు. అప్పట్లో ఈ కేసు విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
BANDI SANJAY : RRRపై బండి సంజయ్ ప్రశంసలు.. టీబీజేపీ చీఫ్ ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్
ఇదిలావుండగా.. ‘అజాన్’ అంశం చాలాకాలం నుంచి చర్చనీయాంశంగా ఉంది. ప్రార్థన పిలుపు కోసం లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ద్వారా.. ఇతర మతాలవారికి ఇబ్బంది కలిగిస్తోందంటూ ఓ వర్గం వాదిస్తోంది. ఈ అజాన్ శబ్ద కాలుష్యానికి దారి తీస్తోందని, అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందంటూ.. 2005 జులైలో సుప్రీంకోర్టు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్ల వినియోగాన్ని (పబ్లిక్ ఎమెర్జెన్సీ సందర్భాల్లో మినహాయిస్తే) నిషేధించింది. అనంతరం 2005 అక్టోబర్లో.. ఏడాదిలో 15 రోజుల పాటు పండగ సందర్భాల్లో అర్థరాత్రి వరకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించవచ్చని అనుమతి ఇచ్చింది. అటు.. ఇతర మతాల మనోభావాల్ని అజాన్ దెబ్బతీస్తోందని వేసిన పిల్ని గతేడాది విచారించిన కర్ణాటక హైకోర్టు.. అజాన్ విషయంలో మసీదులకు ఎలాంటి ఆదేశాల్ని జారీచేసేందుకు నిరాకరించింది. ఇతర మతాల ప్రాథమిక హక్కుల్ని అజాన్ ఉల్లంఘిస్తోందన్న వాదనను అంగీకరించలేమని పేర్కొంది.
kousalya : కొడుకు కోసం కష్టాలు పడ్డా.. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకోమంటున్నాడు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!